కావేరి నది పుష్కరాలు..........
గంగానది తర్వాత అంతటి పవిత్రమైనదిగా భావించే నది కావేరి. అందుకే కావేరిని దక్షిణ గంగ అని పిలుస్తారు. దేవగురువైన బృహస్పతి తులారాశిలో ప్రవేశించడంతో కావేరీనదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. బృహస్పతి ఈ సెప్టెంబర్ 12న కన్యారాశి నుంచి తులారాశిలో ప్రవేశం కాబట్టి ఈ 12 రోజులూ ఆ నది పుష్కర శోభను సంతరించుకుంటుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు కావేరీ పుష్కరాలలో పుణ్యస్నానాలు చేసి పునీతులవుతారు. నర్మదా నదీతీరంలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశీక్షేత్రంలో మరణించడం వల్ల కలిగే ఫలం కేవలం పుష్కర స్నానం వల్ల కలుగుతుందని పురాణోక్తి.
ఎక్కడ పుట్టింది?
పూర్వం బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో కావేరుడనే రాజు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో బ్రహ్మని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు మెచ్చి, ఓ అందాల పాపను ప్రసాదించాడు. కావేరి అని పేరు పెట్టుకుని రాజు ఆ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. యుక్తవయసు రాగానే ఆమెను అగస్త్య మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. వివాహ సమయంలో తనను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టకూడదని అగస్త్యుని కోరింది కావేరి. అంగీకరించాముని.
అగస్త్యుడు ఓ రోజున తన శిష్యులకు తత్త్వశాస్త్ర రహస్యాలను బోధించడం కోసం శిష్యులను దూరంగా తీసుకెళ్లి పాఠాలు చెబుతున్నాడు. భర్త తనను విడిచి వెళ్లడంతో కావేరి కోపంతో ఒక తటాకంలో దూకింది. అయితే, ఆమె బ్రహ్మవర ప్రసాదిని కావడంతో మరణించడానికి బదులు నదిగా మారిపోయి బ్రహ్మగిరి పర్వతాల మీదుగా ప్రవహిస్తూ వెళ్లింది. ఆమే కావేరీ నదిగా ప్రసిద్ధికెక్కింది.మరో కథ ఏమిటంటే, తనని విడిచి ఉండరాదన్న భార్య కోరికను మన్నించి అగస్త్యుడు ఆమెను జలరూపంలోకి మార్చి తన కమండలంలో ఉంచుకుని ఎల్లప్పుడూ తనవద్దే ఉంచుకునేవాడు. అయితే, ఒకసారి ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైన క్షామం వచ్చింది. వర్షాలు లేక జలాశయాలన్నీ ఎండిపోయాయి. పంటలు పండక ప్రజలు అల్లాడుతూ, విఘ్నేశ్వరుని ప్రార్థించారు.
వినాయకుడు ఆవు రూపంలో అగస్త్యుని వద్దకు వచ్చి, గడ్డిమేస్తున్నట్లు నటిస్తూ, కమండలాన్ని తన ముట్టెతో కింద పడేలా చేశాడు. దాంతో కావేరి కాస్తా నదీరూపాన్ని సంతరించుకుని, అక్కడినుంచి తన పుట్టినిల్లైన బ్రహ్మగిరి వరకూ ప్రవహించింది.
కావేరీ పుష్కర స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం.
పుష్కర స్నాన విధి
ముందుగా పుష్కర నదికి ప్రార్థన చేసి తీరంలో ఉండి మట్టిని మూడుసార్లు నీటిలో వేసి తరువాత సంకల్ప సహితంగా పుష్కర స్నానం చేయాలి. పితృదేవతలకు తర్పణం, తీర్థోపవాసం చేయాలి. మృత్తికా స్నానం, పుష్కర స్నానం చేసి ముక్కోటి దేవతలకు, మునులకు తర్పణ విడవాలి. మళ్లీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి. దీర్ఘాయువునిచ్చే నదీపూజలు: పుష్కర యాత్రలు చేసిన వారికి, నదీ పూజలు నిర్వహించిన వారివి వ్యాధులు, పాపాలూ తొలగి, దీర్ఘాయుష్షు లభిస్తుందని పురాణగాథలు విదితం చేస్తున్నాయి.
ఏమిటీ పుష్కరం?
పుష్కరం అంటే పన్నెండేళ్ల కాలం. దేవ గురువు బృహస్పతి తులారాశిలోకి ప్రవేశించినప్పుడు కావేరికి పుష్కరాలు వస్తాయి. ఈ సమయంలో నదికి ఆధి దైవిక శక్తులు వస్తాయి. ఈ çసమయంలో స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్ఠానాలకు, పితృపిండ ప్రదానానికి అక్షయమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. ఈ కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయి.
కర్నాటక రాష్ట్రంలో శ్రీరంగపట్నం, మైసూరు, శ్రావణబెల్
గోల, ధర్మస్థలం, వర్నాడు, కొక్కిసుబ్రమణ్యం, ఉడిపి, శృంగేరి, గోకర్ణం లాంటి మహా పుణ్యక్షేత్రాలు
తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం, జంబుకేశ్వరం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, తిరుచెందూరు, చిదంబరం, కుంబకోణం వంటి పుణ్యక్షేత్రాలు.
కావేరీ నదీ పుష్కరాల వివరాలు*
12-09-2017 నుండి 23-09-2017 వరకు
కావేరీనదిని దక్షిణ గంగ అని పిలుస్తారు.
సహ్యపర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,320 మీటర్ల ఎత్తున మైసూర్లోని బ్రహ్మగిరి కొండపై కావేరి ఆవిర్భవించింది. *కొడుగు లేదా కూర్గు* అనే ప్రాంతం ఈనదికి రూపకల్పన చేస్తుంది. కావున ఈ నది ‘‘కూర్గుకువూరి’’ అని కావేరి ఉద్భవించే ప్రదేశాన్ని తలక్కాలేరా అని అంటారు. కావేరీ పుట్టెచోట ఒకచిన్న తొట్టె ఆకారంలో ఉంటుంది.
ఈతలక్కామేరీలో కావేరీమాత పెద్ద విగ్రహం ఉంది. కావేరీ దేవతగా భక్తులు పిలుస్తారు. భక్తుల కోర్కెతీర్చే ఇలవేల్పుగా కావేరీ దేవత పేరు పొందినది. ఈ దేవతకు ప్రతిఏటా శ్రావణమాసంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది.
దక్షిణగంగగా పేరుపొందిన కావేరికి షింసా, భవాని అనే రెండు ముఖ్యమైన ఉపనదులు చెప్పబడుతున్నాయి.
ఇవికాక కనక, సుజోజ్యోతి, హేమావతి, లోకాపాము, అర్ఖావతి, తొప్పైయ్యేరు శరభంగ, మణిమధుర, హాళే, సాగరఘాటె, లక్ష్మణతీర్థ, కాబినికుండల, అమరావతి మొదలగు చిన్నపెద్ద మొత్తం కలిసి 50కిపైగా కావేరికి ఉపనదులు ఉన్నాయి.
వీటివల్ల కావేరివెడల్పు పెరిగి ప్రవహిస్తుంది.
కావేరి పరివాహక ప్రాంతం అంతా సస్యశ్యామలం. అందుకే కావేరీని ‘‘పొన్ని’’ అని అంటారు.
పొన్ని అంటే ధాన్యం అని బంగారు అని రెండు అర్థాలు. ఈ నది ధాన్యసమృద్ధి కలిగించేది, బంగారు పంటలు పండిచేదని ఈ కావేరినదికి పేరు.
కూర్గుకొండల్లో జన్మించి కొంతదూరం పర్వతసీమలందే ప్రవహించి తర్వాత ఆగ్నేయదిశగా ప్రవహించి మైసూరు రాష్ట్రంలో పీఠభూమి దశవదిలి క్రిందన గల పల్లంలోనికి శివసముద్రంవద్ద దూకుతుంది. ఇక్కడ కావేరి రెండుగా చీలుతుంది. ఈ రెండు చీలకల పేర్లు పరుచుక్కి, గగనచుక్కి అని పిలుస్తారు. పరచుక్కి 230 అడుగులు క్రిందకి ఒక జలపాతంలా పడుతుంది.
గగనచుక్కి అద్భుతంగా 90 కి.మీ. కొండచరియల్లోకిపడి కావేరీనదీ అలసటలేకుండా ప్రవహిస్తుంది. శివసముద్రం దాటిన తర్వాత కావేరి తమిళనాడు రాష్ట్రంలో ప్రవేశించి, తంజావూరు జిల్లాలో అధికశాతం ప్రవహించి కావేరి అక్కడనుండి మరికొంతదూరం సాగి బంగాళాఖాతంలో కలుస్తుంది.
స్నానయోగ్యమైన కావేరి నదీతీర పుణ్యక్షేత్రాలు.
*చిదంబరం*
అతిప్రాచీన దేవాలయం, శివుడు ప్రళయతాండవం చేస్తున్న అతిపెద్ద విగ్రహం.
నాలుగుదిక్కులు నాలుగు రాజగోపురాలు నటరాజస్వామి ఆలయంలో ఆలయంలోని నృత్యమందిరంలో ఎన్నో నృత్యభంగిమలు వందలకొలది వున్నాయి.
వెయ్యి స్తంభాల మంటపం అత్యుద్భుతంగావుంది. ఈక్షేత్రం పంచలింగాల్లో ఒక్కటైన ఆకాశలింగము ఉంది. ఈ క్షేత్రం తంజావూరుకు 106 కి.మీ. దూరంలో ఉంది. ఈ క్షేత్రం కావేరినది ఒడ్డునవుంది.
*శ్రీరంగం* :
ఈ క్షేత్రములో రంగనాధులు, రంగనాయకలు ప్రదానదేవతలు. ధనుర్మాసంలో గొప్పగా ఉత్సవాలు జరుగుతాయి.
ఈ క్షేత్రంలో 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో, 24 మంటపాలతోపాటు వేయిస్తంభాల మంటపం కల్గిన అతిపెద్ద వైష్ణవక్షేత్రం.
ఈ క్షేత్రాన్ని మద్రాసు బెంగుళూరు నుండి రైలుమార్గాలు కలవు. ఈక్షేత్రం తిరుచినాపల్లి (తిరుచ్చి) ప్రక్కన కావేరి నది ఒడ్డున కలదు.
*తంజావూరు*
చోళరాజులునిర్మించారు. ఇక్కడ స్వామి బృహదీశ్వరేశ్వరుడు. అమ్మవారు బృహన్మాక, గర్భాలయం 81 టన్నుల గొప్ప శిలలతో నిర్మితమైనది. శ్రీరంగం క్షేత్రమునకు సుమారుగా 90 కి.మీ దూరం ఈ క్షేత్రం కలదు.
*కుంభకోణం*
ఈ ప్రాంత చోళరాజులు పరిపాలించిన ప్రదేశం. ఈక్షేత్రంలో ప్రసిద్ధిమైన 4 విష్ణాలయములు, 12 శివాలయములు వున్నది.
కుంభకోణ క్షేత్రమంతా దేవాలయాల సముదాయమే. ఈ క్షేత్రం *తంజావూరు*నుండి 38 కి.మీ. దూరంలో ఉన్నది.
గంగానది తర్వాత అంతటి పవిత్రమైనదిగా భావించే నది కావేరి. అందుకే కావేరిని దక్షిణ గంగ అని పిలుస్తారు. దేవగురువైన బృహస్పతి తులారాశిలో ప్రవేశించడంతో కావేరీనదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. బృహస్పతి ఈ సెప్టెంబర్ 12న కన్యారాశి నుంచి తులారాశిలో ప్రవేశం కాబట్టి ఈ 12 రోజులూ ఆ నది పుష్కర శోభను సంతరించుకుంటుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు కావేరీ పుష్కరాలలో పుణ్యస్నానాలు చేసి పునీతులవుతారు. నర్మదా నదీతీరంలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశీక్షేత్రంలో మరణించడం వల్ల కలిగే ఫలం కేవలం పుష్కర స్నానం వల్ల కలుగుతుందని పురాణోక్తి.
ఎక్కడ పుట్టింది?
పూర్వం బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో కావేరుడనే రాజు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో బ్రహ్మని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు మెచ్చి, ఓ అందాల పాపను ప్రసాదించాడు. కావేరి అని పేరు పెట్టుకుని రాజు ఆ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. యుక్తవయసు రాగానే ఆమెను అగస్త్య మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. వివాహ సమయంలో తనను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టకూడదని అగస్త్యుని కోరింది కావేరి. అంగీకరించాముని.
అగస్త్యుడు ఓ రోజున తన శిష్యులకు తత్త్వశాస్త్ర రహస్యాలను బోధించడం కోసం శిష్యులను దూరంగా తీసుకెళ్లి పాఠాలు చెబుతున్నాడు. భర్త తనను విడిచి వెళ్లడంతో కావేరి కోపంతో ఒక తటాకంలో దూకింది. అయితే, ఆమె బ్రహ్మవర ప్రసాదిని కావడంతో మరణించడానికి బదులు నదిగా మారిపోయి బ్రహ్మగిరి పర్వతాల మీదుగా ప్రవహిస్తూ వెళ్లింది. ఆమే కావేరీ నదిగా ప్రసిద్ధికెక్కింది.మరో కథ ఏమిటంటే, తనని విడిచి ఉండరాదన్న భార్య కోరికను మన్నించి అగస్త్యుడు ఆమెను జలరూపంలోకి మార్చి తన కమండలంలో ఉంచుకుని ఎల్లప్పుడూ తనవద్దే ఉంచుకునేవాడు. అయితే, ఒకసారి ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైన క్షామం వచ్చింది. వర్షాలు లేక జలాశయాలన్నీ ఎండిపోయాయి. పంటలు పండక ప్రజలు అల్లాడుతూ, విఘ్నేశ్వరుని ప్రార్థించారు.
వినాయకుడు ఆవు రూపంలో అగస్త్యుని వద్దకు వచ్చి, గడ్డిమేస్తున్నట్లు నటిస్తూ, కమండలాన్ని తన ముట్టెతో కింద పడేలా చేశాడు. దాంతో కావేరి కాస్తా నదీరూపాన్ని సంతరించుకుని, అక్కడినుంచి తన పుట్టినిల్లైన బ్రహ్మగిరి వరకూ ప్రవహించింది.
కావేరీ పుష్కర స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం.
పుష్కర స్నాన విధి
ముందుగా పుష్కర నదికి ప్రార్థన చేసి తీరంలో ఉండి మట్టిని మూడుసార్లు నీటిలో వేసి తరువాత సంకల్ప సహితంగా పుష్కర స్నానం చేయాలి. పితృదేవతలకు తర్పణం, తీర్థోపవాసం చేయాలి. మృత్తికా స్నానం, పుష్కర స్నానం చేసి ముక్కోటి దేవతలకు, మునులకు తర్పణ విడవాలి. మళ్లీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి. దీర్ఘాయువునిచ్చే నదీపూజలు: పుష్కర యాత్రలు చేసిన వారికి, నదీ పూజలు నిర్వహించిన వారివి వ్యాధులు, పాపాలూ తొలగి, దీర్ఘాయుష్షు లభిస్తుందని పురాణగాథలు విదితం చేస్తున్నాయి.
ఏమిటీ పుష్కరం?
పుష్కరం అంటే పన్నెండేళ్ల కాలం. దేవ గురువు బృహస్పతి తులారాశిలోకి ప్రవేశించినప్పుడు కావేరికి పుష్కరాలు వస్తాయి. ఈ సమయంలో నదికి ఆధి దైవిక శక్తులు వస్తాయి. ఈ çసమయంలో స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్ఠానాలకు, పితృపిండ ప్రదానానికి అక్షయమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. ఈ కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయి.
కర్నాటక రాష్ట్రంలో శ్రీరంగపట్నం, మైసూరు, శ్రావణబెల్
గోల, ధర్మస్థలం, వర్నాడు, కొక్కిసుబ్రమణ్యం, ఉడిపి, శృంగేరి, గోకర్ణం లాంటి మహా పుణ్యక్షేత్రాలు
తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం, జంబుకేశ్వరం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, తిరుచెందూరు, చిదంబరం, కుంబకోణం వంటి పుణ్యక్షేత్రాలు.
కావేరీ నదీ పుష్కరాల వివరాలు*
12-09-2017 నుండి 23-09-2017 వరకు
కావేరీనదిని దక్షిణ గంగ అని పిలుస్తారు.
సహ్యపర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,320 మీటర్ల ఎత్తున మైసూర్లోని బ్రహ్మగిరి కొండపై కావేరి ఆవిర్భవించింది. *కొడుగు లేదా కూర్గు* అనే ప్రాంతం ఈనదికి రూపకల్పన చేస్తుంది. కావున ఈ నది ‘‘కూర్గుకువూరి’’ అని కావేరి ఉద్భవించే ప్రదేశాన్ని తలక్కాలేరా అని అంటారు. కావేరీ పుట్టెచోట ఒకచిన్న తొట్టె ఆకారంలో ఉంటుంది.
ఈతలక్కామేరీలో కావేరీమాత పెద్ద విగ్రహం ఉంది. కావేరీ దేవతగా భక్తులు పిలుస్తారు. భక్తుల కోర్కెతీర్చే ఇలవేల్పుగా కావేరీ దేవత పేరు పొందినది. ఈ దేవతకు ప్రతిఏటా శ్రావణమాసంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది.
దక్షిణగంగగా పేరుపొందిన కావేరికి షింసా, భవాని అనే రెండు ముఖ్యమైన ఉపనదులు చెప్పబడుతున్నాయి.
ఇవికాక కనక, సుజోజ్యోతి, హేమావతి, లోకాపాము, అర్ఖావతి, తొప్పైయ్యేరు శరభంగ, మణిమధుర, హాళే, సాగరఘాటె, లక్ష్మణతీర్థ, కాబినికుండల, అమరావతి మొదలగు చిన్నపెద్ద మొత్తం కలిసి 50కిపైగా కావేరికి ఉపనదులు ఉన్నాయి.
వీటివల్ల కావేరివెడల్పు పెరిగి ప్రవహిస్తుంది.
కావేరి పరివాహక ప్రాంతం అంతా సస్యశ్యామలం. అందుకే కావేరీని ‘‘పొన్ని’’ అని అంటారు.
పొన్ని అంటే ధాన్యం అని బంగారు అని రెండు అర్థాలు. ఈ నది ధాన్యసమృద్ధి కలిగించేది, బంగారు పంటలు పండిచేదని ఈ కావేరినదికి పేరు.
కూర్గుకొండల్లో జన్మించి కొంతదూరం పర్వతసీమలందే ప్రవహించి తర్వాత ఆగ్నేయదిశగా ప్రవహించి మైసూరు రాష్ట్రంలో పీఠభూమి దశవదిలి క్రిందన గల పల్లంలోనికి శివసముద్రంవద్ద దూకుతుంది. ఇక్కడ కావేరి రెండుగా చీలుతుంది. ఈ రెండు చీలకల పేర్లు పరుచుక్కి, గగనచుక్కి అని పిలుస్తారు. పరచుక్కి 230 అడుగులు క్రిందకి ఒక జలపాతంలా పడుతుంది.
గగనచుక్కి అద్భుతంగా 90 కి.మీ. కొండచరియల్లోకిపడి కావేరీనదీ అలసటలేకుండా ప్రవహిస్తుంది. శివసముద్రం దాటిన తర్వాత కావేరి తమిళనాడు రాష్ట్రంలో ప్రవేశించి, తంజావూరు జిల్లాలో అధికశాతం ప్రవహించి కావేరి అక్కడనుండి మరికొంతదూరం సాగి బంగాళాఖాతంలో కలుస్తుంది.
స్నానయోగ్యమైన కావేరి నదీతీర పుణ్యక్షేత్రాలు.
*చిదంబరం*
అతిప్రాచీన దేవాలయం, శివుడు ప్రళయతాండవం చేస్తున్న అతిపెద్ద విగ్రహం.
నాలుగుదిక్కులు నాలుగు రాజగోపురాలు నటరాజస్వామి ఆలయంలో ఆలయంలోని నృత్యమందిరంలో ఎన్నో నృత్యభంగిమలు వందలకొలది వున్నాయి.
వెయ్యి స్తంభాల మంటపం అత్యుద్భుతంగావుంది. ఈక్షేత్రం పంచలింగాల్లో ఒక్కటైన ఆకాశలింగము ఉంది. ఈ క్షేత్రం తంజావూరుకు 106 కి.మీ. దూరంలో ఉంది. ఈ క్షేత్రం కావేరినది ఒడ్డునవుంది.
*శ్రీరంగం* :
ఈ క్షేత్రములో రంగనాధులు, రంగనాయకలు ప్రదానదేవతలు. ధనుర్మాసంలో గొప్పగా ఉత్సవాలు జరుగుతాయి.
ఈ క్షేత్రంలో 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో, 24 మంటపాలతోపాటు వేయిస్తంభాల మంటపం కల్గిన అతిపెద్ద వైష్ణవక్షేత్రం.
ఈ క్షేత్రాన్ని మద్రాసు బెంగుళూరు నుండి రైలుమార్గాలు కలవు. ఈక్షేత్రం తిరుచినాపల్లి (తిరుచ్చి) ప్రక్కన కావేరి నది ఒడ్డున కలదు.
*తంజావూరు*
చోళరాజులునిర్మించారు. ఇక్కడ స్వామి బృహదీశ్వరేశ్వరుడు. అమ్మవారు బృహన్మాక, గర్భాలయం 81 టన్నుల గొప్ప శిలలతో నిర్మితమైనది. శ్రీరంగం క్షేత్రమునకు సుమారుగా 90 కి.మీ దూరం ఈ క్షేత్రం కలదు.
*కుంభకోణం*
ఈ ప్రాంత చోళరాజులు పరిపాలించిన ప్రదేశం. ఈక్షేత్రంలో ప్రసిద్ధిమైన 4 విష్ణాలయములు, 12 శివాలయములు వున్నది.
కుంభకోణ క్షేత్రమంతా దేవాలయాల సముదాయమే. ఈ క్షేత్రం *తంజావూరు*నుండి 38 కి.మీ. దూరంలో ఉన్నది.