Sunday, 22 October 2017

కాలసర్పయోగ ( దోష ) ఫలితాలు........

కాలసర్పయోగ ( దోష ) ఫలితాలు........
1. జ్ఞానదృష్టిలేకపోవటములేకమెదడుసరిగాఎదగకపోవడమువల్లఅవమానాలు ( లేక ) అపార్ధాలుచేసుకోవడము.
2. జన్మించినసంతానమునకుబుధిమాంద్యముకలుగుట.
3. గర్భములోశిశువుమరణించుట .
4. భార్యభర్తలమధ్యసక్యతలేకపోవుట ( లేక ) వైవాహికజీవతంలోఅసంతృప్తి.
5. మరణించినశిశువుకలుగుట.
6. గర్భమునిలవకపోవడము, విచిత్రమయినరోగములుకలగడము.
7. అంగవైకల్యముసంతానముకలగడము, వాహనప్రమాదాలు.
8. శస్త్రచికిచలువిపలము అయిమరణించడంజరుగుతుంది.
9. వృషణములవ్యాధులు , వ్యసనాలకుభానిసలుకావడము.
10. వీర్యకణములునశించుట, నసుపుకత్వముఏర్పడుట.
11. కాన్సర్, సిఫిలిస్ , హెర్నియా , ఎయిడ్స్ , ముత్రసంబందమయినరోగములుకలగడము.
12. వంశవృదిలేకపోవడము, కుటుంబములోప్రేమఅభిమనములుతగిపోవడము.
13. శత్రువులవలనమృతిచెందడము, సంతానముశత్రువులుగామారడము.
14. మానసికశాంతిలేకపోవడము, విషజంతువులవల్ల, జలప్రమాదములవల్లమరణించడం.
15. అవమానాలులేకఅపనిందలవల్లమరణించడం, పరస్రిసంపర్కము.
16. రునగ్రస్థులుఅగుటహామీలుఉండుటజరుగును.
జాతకునిజన్మకుండలిలోరాహుకేతువులమద్యమిగిలినఅన్నిగ్రహాలువచ్చినచొదానినికాలసర్పయోగంఅనిఅంటారు. దీనిలోచాలరకాలువున్నాయి. వాటివాటిస్తితులనుబట్టివాటికిపేర్లునిర్ణయంచెయ్యటంజరుగుతుందిదానిప్రకారమేకాలసర్పయోగంవలనకలిగేఫలితంకూడానిర్ణయంచెయ్యబడుతుంది.
వివిధరకాలకాలసర్పయోగములు
1.)అనంత కాల సర్ప యోగము
2.)గుళికకాలసర్పదోషం
3.)వాసుకికాలసర్పదోషం
4.)శంక పాల కాలసర్పదోషం
5.)పద్మకాలసర్పదోషం
6.)మహాపద్మకాలసర్పదోషం
7.)తక్షకకాలసర్పదోషం
8.)కర్కోటకకాలసర్పదోషం
9.)శంఖచూడకాలసర్పదోషం
10.)ఘటకకాలసర్పదోషం
11.)విషక్త, లేక విష దానకాలసర్పదోషం
12.)శేషనాగకాలసర్పదోషం
అనంత కాల సర్ప యోగము
జన్మ లగ్నము నుండి సప్తమ స్థానము వరకు రాహు కేతు గ్రహముల మధ్య మిగతా గ్రహములు
( రవి ,చంద్ర ,కుజ ,బుధ ,గురు ,శుక్ర, శని ). వుంటేదీనినిఅనంతకాలసర్పయోగముఅంటారు.
ఫలితాలు: కుటుంభసమస్యలు, దీర్గరోగాలు, వైవాహికజీవతంలోఅసంతృప్తి, మానసికశాంతిలేకపోవడము, రునగ్రస్థులుఅగుటహామీలుఉండుటజరుగును.
గుళికకాలసర్పదోషం:
మాములుగాఇదిజాతకచక్రంలోరెండోవ ఇంటప్రారంభంఅయ్యిఎనిమిదొవ ఇంటసంమప్తంఅవుతుంది.
ఫలితాలు:ఆర్ధికమరియుకుటుంభఇబ్బందులు, . భార్యభర్తలమధ్యసక్యతలేకపోవుట ( లేక ) వైవాహికజీవతంలోఅసంతృప్తి, మిత్రులవలన విరోదములు కలుగును.
వాసుకికాలసర్పదోషం:
మూడోవ ఇంటమొదలయితొమ్మిదొవ ఇంటసమాప్తం.
ఫలితాలు: అన్నదమ్ములకలహాలు, సమస్యలు, బందువులవలనసమస్యలుఎకువగావుంటాయి
ఉద్యోగములోబాధలు, పదోనతిలోఆటంకాలు, ఉద్యోగమువుదిపోవటంజరుగును.
శంక పాల కాలసర్పదోషం:
నాలుగోవ ఇంటమొదలయిపదవ ఇంట సమాప్తం.
ఫలితాలు: తల్లివలనలేదాతల్లికిసమస్య, వాహనగన్డం, నివాసస్తలసమస్యలు, విద్యలోఆటంకములు, ఉద్యోగ, వ్యాపారములలోలాబములులేకపోవుట.
పద్మకాలసర్పదోషం:
అయిదోవ ఇంటప్రారంభమయిపదకొండవ ఇంటసమాప్తం.
ఫలితాలు: జీవితభాగస్వామితోకానిపిల్లలతోకానిసమస్యలు విచిత్ర వ్యాదులు రావడము, వ్యసనముల వల్ల భారి నష్టాలు రావడం, భార్య భర్తల మధ్య అనుమానాలు తలేతడం, ధనము ఖర్చుఅగుట, శత్రువుల వలన జైలుకు వెల్లడము, కష్టాలు కలుగును, బాల్యము నుండీ బాధలు కలుగును.
మహాపద్మకాలసర్పదోషం:
ఆరవ ఇంటప్రారంభంఅయ్యిపన్నెండవ ఇంటసమాప్తం.
ఫలితాలు: ఆరోగ్యసమస్య, అప్పులబాధ, శత్రుబాధ, భార్యభర్తలుఅనుకూలముగాలేకపోవడము, జీవితాంతమురోగములవలనబాధనిరాసయకువగాఉండును. వ్రుధాప్యములోకష్టాలుకలగడము, శత్రువులతోపోరాడటం, గృహమునందుఅసంతృప్తికలుగుతుంది.
తక్షకకాలసర్పదోషం:
యేడవ ఇంటప్రారంభంలగ్నము ఇంటసమాప్తం.
ఫలితాలు: వ్యాపారము లో చిక్కులు, పిత్రార్జితం ఖర్చు చేయడము, పుత్ర సంతానము లేదని బాధ పడటము, జీవిత భాగస్వామి తో సమస్యలు, పర శ్రీ సంగమము, శత్రు పీడా, అనారోగ్యం కలుగును.
కర్కోటకకాలసర్పదోషం:
ఎనిమిదొవఇంటప్రారంభంరెండోవ ఇంటసమాప్తం.
ఫలితాలు: వైవాహికజీవతంలోఅసంతృప్తి, అకాల మరణము, మోసములకు గురికావడము, దీర్గ రోగములు, ఆపరేషన్లు, ఎంత కష్టపడిన పలితము దక్కదు. జీవితములో అన్ని ఆలస్యముగా జరుగుతాయి, మంచి ఉద్యోగము దొరుకుట చాల శ్రమ చేయవలసి వస్తుంది, విపరీత ధన నష్టము జరుగును.
శంఖచూడకాలసర్పదోషం:
తొమ్మిదొవఇంటప్రారంభంవమూడోవ ఇంటసమాప్తం.
ఫలితాలు: అత్యంతదురదృష్టస్తితి, దేవునియందుభక్తిలేకపోవడము, తండ్రి, గురువులతోవిరోధము, వ్యవసాయమునందుఅధికముగాశ్రమించిననష్టములుకలుగును. అవమానములు, బాధలు, ధనమునందుఅసంతృప్తికలుగును.
ఘటకకాలసర్పదోషం:
పదవఇంటప్రారంభంనాలుగోవ ఇంటసమాప్తం.
ఫలితాలు: వ్యాపారమరియుఉద్యోగసమస్యలు, తల్లితండ్రులకుదూరముగానివసించదము, మిత్రద్రోహులు , వ్యాపారలావాదేవులలోనష్టము, సంతానదోషములుకలుగును.
విషక్త, లేక విష దానకాలసర్పదోషం:
పదకొండవఇంటప్రారంభంఅయిదోవ ఇంటసమాప్తం.
ఫలితాలు: ఆర్ధికమరియువ్యాపారకష్టాలు, నేత్ర సంబంధ రోగములు , సోదరులు , మిత్రులతో తగాదాలు, గృహమును విడచి పరదేశములో నివసించదము, కోర్టు వ్యవహారములలో తల దుర్చడం, రహస్య విషయాలు గోప్యముగా ఉంచడము జరుగును.
శేషనాగకాలసర్పదోషం:
పన్నెండవఇంటప్రారంభంఆరవ ఇంటసమాప్తం.
ఫలితాలు: ఎక్కువఖర్చులు, శత్రుబాధలు కోర్టు వివాదాలు , అవమానాలు, ప్రాణభయము, అధిక ఖర్చులు.
ని సంతానయోగములు
కుజుడు పంచమములొ వుంది ఆ పంచమం శని రాశి గాని శని నవంసము గాని ఆ శనికి సప్తమా ద్రుష్టి కలిగి వుంటే సంతానము కలగదు.
పంచమములొ శని లేక రాహువు వుంది పాప గ్రహ ద్రుష్టి వున్నచొ సంతానము కలగదు.
పుత్ర స్థానమునందు రవి, కుజ రహువులు మరియు శని బలముగా వుంది పుత్ర కరక గ్రాహం బలహీనముగా వున్నా సంతానము కలగదు.
పంచామదిపతి నీచలో వున్నా పంచమ స్థానము కర్కాటక రాశిలో కుజుడు వున్నా సంతానము కలగదు.
పంచామదిపతి ఆస్థాన్గాతుడు అయి వుంది బుధుడు సమ రాశిలో ఉన్తే సంతానము కలగదు.
గురువు, లగ్నాధిపతి , సప్తమాధిపతి, పంచామదిపతి నిబలురు అయిన ఆ జాతకులకు సంతానము కలగదు.
శని షష్టమాదిపతి 6 వ బావమునందు, చంద్రుడు సప్తమ భవమునన్దున్న జాతకులకు సంతానము కలగదు
మేష రాశి లో గురువు మరియు బుధుడు వుంది మేషరాసి పంచమ భావము అయినచో సంతానము కలగదు.
కుజుడు మరియు శని చతుర్ధము లో ఉంటే సంతానము కలగదు.
చంద్రుడు 10 లో శుక్రుడు 7 లో 4 లో పాపులు ఉన్నచో సంతానము నశించును.
లగ్న , పంచమ, నవమదిపతులలో యవరికయినాను కుజ, శనుల సంబంధము, అష్టమాదిపతి సంబందము కుడా ఉన్నచో సంతాన నష్టము కలుగును.
గురువు పంచమదిపతి పాపుల మధ్య నున్నను , సష్ట,వ్యమాది పతులు అప్తంగాతది దోషములు ఉన్నచో సంతానము కలగదు.
వృచిక లగ్నమునందు గురు సుక్రులు లేక శని బుధులు ఉన్నచో సంతానము కలగదు.
పంచమ స్థానము నందు గురువు వుండి ఆ పంచమ స్థానము మేషము , కర్కాటక, మకర మరియు ధనుర్ లగ్నములు అయినచో సంతాన నష్టము కలుగును.
2, 5, 7 పతులు ఎవరయినా 6, 8, 12 స్థానములందు వుండి శత్రు గ్రహ మధ్య గతులయిన, పంచమధిపతి శత్రు, నీచ రాసులు అందుండగా మరియు 9 వ స్థానములో పాపులు వున్నాను సంతానము కలగదు.
సింహ , వ్రుచిక రాశుల వారికీ జన్మ లగ్న మునందు పాప గ్రహములు వుండి గురు, శుక్రులు కలసి వ్యయమునందు వున్నా సంతానము కలగదు
బుధుడు నుండి శని తను , పుత్ర , కళత్ర మరియు వ్యయభవములలొ ఉన్నచో సంతానము కలగదు.
పంచమది పతి వ్యయములో వుండి చతుర్ధ, దశమ భావదిపతులు తో సంబంధము యార్పడితే సంతానము కలగదు.
పంచమ స్థానములో రాహువు ఉంటే అల్ప సంతానము లేక సంతాన నష్టము లేక సంతానము లేకపోవడము జరుగును. శ్రీ సంతానము యకువగా ఉండును, మరియు రాహువు పయ్ పాపుల ద్రుష్టి వున్నా సంతానము కలగదు.
పంచమ స్థానములో కేతువు వున్నా పయ్ పలితములు కలుగును.
శ్రీ జన్మ రాశికి పంచమ రాశి లో పురుషుడు జన్మించిన సంతాన నష్టము.
పంచమదిపతి చంద్రుడు బుదునితో వ్యయము నందు గురువు అష్టమము నందు వున్నా సంతానము కలగదు.
అష్టమము నందు శని వుండి వాని దశ వచినపుడు పుత్ర నష్టము కలుగును.
పంచమదిపతి శని, రవితో కలసి మేషము నందుండి పంచమము కుజుని ద్రుష్టి కలిగిన సంతానము కలగదు.
సంతానము కలుగుట
పంచమదిపతి లగ్నది పతి సుభులతో కూడిన కేంద్రములందు వుండి ధనాధిపతి బలము కలిగి ఉంటే పుత్ర సంతానము కలుగును.
లగ్నది పతి పంచమము భావములో వుండి నవమదిపతి సప్తమ స్థానములో వుండి ద్వితీయ అధిపతి మరియు ధనాధిపతి లగ్నములో ఉంటే పుత్ర సంతానము కలుగును.
నవములో గురువు, గురునికి కేంద్రమున శుక్రుడు ఉంటే లగ్నాధిపతి బలముగా ఉంటే చాల ఆలస్యముగా సంతానము కలుగును.
పంచమదిపతి శని అయితే గురు, చంద్ర ద్రుష్టి ఉంటే స్వల్ప సంతానము కలుగును.
పంచమదిపతి పంచమునన్దు గులికుడుంది ఆ స్థానాధిపతి పంచమములొ వున్తెయ్ కవలలు సంతానము కలుగును.
ద్వితీయ , పంచామదిపతులకు కుజ, శని సంబందము ఉంటే సష్తమ స్థానము లందు గురువు ఉంటే శ్రీ సంతానము కలుగును.
రవిగాని , శని గాని సి గ్రహ రాశి అంశాలలో వుండగా బుధ ద్రుష్టి ఉంటే శ్రీ సంతానము కలుగును.
గురుని నవంసదిపతి కేంద్రములలో ఉంటే సంతానము కలుగును.
శని, కుజులు కలసి 4 వ స్థానము నందు ఉంటే దత్తపుత్రులు కలిగి వుంటారు.
పంచమ భావము నందు శని, చంద్రుడు శని నవంసము నందు ఉంటే దత్తపుత్రులు కలిగి వుంటారు.
లగ్న పంచామదిపతులకు పరస్పర ఒకరి రాశులందు ఒకరు వున్నాను జాతకుని పుత్రులు తండ్రి ఆజ్ఞను శిరసా వహిస్తారు.
పంచమదిపతి , నవమధిపతి కలసి వుండి ధసమధి పతి మహర్ధస జరుగు చున్నపుడు సంతానము కలుగును .
పంచమము కర్కాటకము అయి అందు చంద్ర, గురువులు వున్నా శ్రీ సంతానము ఎకువ .
లగ్న, పంచమది పతి , గురువు ముగ్గురు కేంద్ర కోణములన్దునను జాతకుడికి పుత్ర సంతానము కలుగును..
భాగ్యది పతి , భాగ్య మునందు వున్నాను సంతాన యోగము కలుగును .
పంచమములొ చంద్ర, శుక్రులు వుండి ఆ శుక్రున కు పంచమములొ బుధుడు వున్నా స్త్రీ సంతానము అధికము.
జన్మ లగ్నమునకు పంచమమున గురువు , గురువునకు పంచమమున శని, శనికి పంచమమున రాహువు వున్నాను పుత్ర సంతానము కలుగును
నవమ స్థానములో గురువు వానికి పంచమ స్థానములో రవి ఆ రవికి సప్తమ స్థానములో కుజుడు వున్నా పుత్రా సంతానము కలుగును.
చంద్రునకు పంచమమున గురువు ఆ గురువుకు పంచమమున సాని ఆ సానికి పంచమము నందు రాహువు వున్నా పుత్రా సంతానము కలుగును.
రాహువు కేతువులు సప్త గ్రహములతో కూడిన పలితము
1)రాహువుతో రవి లేక శుక్రులు లగ్నము నుండి ద్వితీయ భావములో ఉన్న లేక రాహువు ఉన్న నేత్ర సంబందమయిన వ్యాదులు కలుగును.
2)ద్వితియములో రాహువు శుక్రులు వుంది అష్టమములో కేతువు శని గ్రహములు ఉన్న రాహువు శుక్రులకు కేతువు, శనుల ద్రుష్టి ఉన్న ముత్ర సంబందమయిన లేక వృషణములు లకు వ్యాదులు మరియు గొంతు సంబందమయిన వ్యాదులు వచును.
3)రాహువు గురువులు కలసియునచో దురాచారములకు లోను అగును. దైవముఫై నమ్మకము ఉండదు. కేతువు గురువు కలసివున్న దైవ బక్తులు అగును.
4)రాహువు అష్టమ బావములో వుంది రాహువుకు రవి, కుజ, మరియు శని వీరిలో ఎవరి ద్రుష్టి తగిలిన వివాహములు ఆలస్యము అగును. బార్య లేక భర్తలలో మృతువు సంభవించును.
5)రాహువు చంద్రునితో కలసి లగ్నమునందు వుండగా పంచమ, నవమ స్థానములు అనగా కొనములలో పాపులు ఉన్నచో మానసిక చంచలత్వము, మంద బుద్ది ఆత్మ హత్యలకు పాల్పడటము జరుగును.
6)జన్మ లగ్నములో శని రహువులు కలసివున్న అనారోగ్యము నాల్గవ స్థానములో ఉన్న మాతృనష్టము, విద్య విగ్నములు కలుగును. ఏడవ స్తనమునందు ఉన్న పితృ సౌక్యము వుండదు. దశమ స్తానములో ఉన్న వృతిరీత్యా చికాకులు కలుగును.
7)పంచమదిపతి అయిన చంద్రుడు శని కుజులతో రాహువు కలసివున్న సంతాన నష్టము కలుగును.
8)శుక్రుడు కేతువు తో కలసి ఉన్న బార్య గయాళి, స్వల్ప సంతతి కలది, బార్య సహోదరులకు నష్టము కలుగును.
9)శని, కేతువులు కలసి కేంద్రములలో ఉన్న రాజయోగము పట్టును.
7 లో శని, కుజ, మరియు రహువులతో కూడిన బ్రంహచార్యము , వివాహము అయిన దాంపత్య జీవితము వుండదు.
రాహువు విద్య స్తానములో ఉన్న విద్యబ్యాస కాలములో రాహువు దాస వచ్చినాచో వైద్య శాస్త్రము అబ్యాసిన్చును.
కేంద్రముల యందు రాహువు పాప గ్రహములతో కూడినను ఆ శిశువు సీగ్రముగా మరణించును.
4 వ అధిపతి రాహువుతో కలసి 6 నందు ఉన్న చోరుల వల్ల మరనింతురు.
6 వ బావము నందు చంద్రుడు లగ్నమునందు రాహువు వున్నాను అపస్మారక రోగము కలుగును.
లగ్నము నందు గురువు, రాహువు ఉన్న దంత రోగములు కలుగును.
కారకాంస లగ్నము నుండి ద్వాదశ భావము నందు కేతువు వున్నాను మరణము అనంతరము బ్రంహా సానిద్యము పొందును.
ద్వితీయ భావములో కేతువు మరియు శుక్రుడు కలసిన పర శ్రీ లతో సంబందము కలిగి వుంటాడు.
కేతువుతో శని మరియు కుజులతో కలసి ద్వితియము లో వుంటే వివాహము ఆలస్యము అగును.
బుధ, కేతువులు 3 భావము లో ఉన్న చెవి వ్యాదులు లేదా ఏదయినా అవయవ లోపము జరుగును.
3 వ భావములో కేతువు, శని కలసిన మంచి ఆరోగ్యము కలిగించును.
కేతువుతో కలసి శని 9 వ స్తానములో ఉంటే తండ్రికి అరిస్టములు కలుగును.
కేతువు, శుక్రులు కలసి 9 వ స్తానములో వుండిన బార్య లేదా భర్తకు నష్టము , స్థిర చర ఆస్తులకు నష్టములు కలుగును.
7 లో కేతువుతో శుక్ర, కుజులు కలసిన వ్యభిచారము చేయును.
7 లో కేతువు తో బుధుడు కలసిన వివాహ విషయములలో మోసము జరుగును.
7 వ భావములో రాహువుతో కుజుడుగాని, రావిగాని, శని గాని చేరిన నీచ శ్రిలతో సంబందము, వ్యభిచారము, భార్యను కోల్పోవడము జరుగును.
7 లో రవి, రహువులు కలసిన సంతాన నష్టము కలుగును.
7 లో రాహువుతో గురు, శుక్రులు కలసిన విధవతో సంగమము జరుగును.
లగ్నము నందు శని పంచమములొ కుజ రహువులు వున్నాను సోదరులు వుండరు.
కుజ రహువులకు 6 వ అధిపతితో సంబందము ఉన్న గాయములు, లేక ఎవరయినా తుపాకితో కాల్చుట లేక కత్తితో పొడుచుట జరుగును.
కుజ రాహువుల కలయిక భు ఆక్రమణలు, కోల్పోవడము జరుగును.
లగ్నమున రవి, రహువులు వున్నాను శిరసు భినముగా ఉండును.
రవితో రాహువు లేక కేతువుతో సంబందము వుండి 8 లో వుంటే అవమానములు కలుగును.
శనితో రాహువు లేక కేతువు వుండి 7 లో ఉన్నచో వ్యభిచారము చేయును.
లగ్నము నందు రవి, 7 లో రాహువు వుంటే భార్య గర్భము ధరించదు.
7 లో రాహువు, 2 లో శని వుండిన ద్వికలత్ర యోగము కలుగును.
రాహు, శుక్రులు కలసిన చాకలి సంగమము జరుగును.
————————————————-
కాల సర్ప యోగము:
రాహు,కేతువుల ప్రభావము మన మీద ఉంటుందా …..
సూర్యుని నించి వచ్చే కాంతి కిరణాలు గ్రహముల మీద పడి అవి అయ్యా రంగులుగా విడి పోయి సప్త కాంతులు మన శరీర, మనస్సులని ప్రభావితము చేస్తుందని, అనగా ఆయా గ్రహాలూ మనమీద ప్రభావాలు చూపిస్తాయని మన పూర్వీకులు జ్యోతిష్య శాస్త్రాని ప్రజలకు అందించారు. అంతే కాదు జ్యోతి అనగా కాంతి మనుష్యుల మీద ఎలా ప్రభావితము చూపుతుందో ఛాయ కూడా మానవుని ప్రభావితము చేస్తుందని, రాహు, కేతువులను చాయా గ్రహాలుగా వర్ణించారు. ఈ సూక్ష్మము గ్రహించని వారు రాహు, కేతువులు గ్రాహాలే కాదు, అవి ఎలా మనిషి మీద ప్రభావముచూపుతాయి అని వితండ వాదన… అసలు గ్రహాలే ప్రభావము ఉండదని ఇంకో వాదన. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈజ్యోతిష్యము, ఫలితాలు, అనేక అంశాలు మానవుని నిత్య జీవితములో అనుభవాలు కాదనలేనివి.
ఇక అసలు విషయము రాహుకేతువులు స్తితి, ప్రతి మనిషి మీద మంచి చెడుల ఫలితాలను చూపుతాయి. గ్రహాల గురించిన విషయాలు,వర్ణనలు, పుట్టుకలు శ్లోకాలు, కదల రూపములో రమ్యముగా చెప్పబడినాయి. అప్పటి రోజులలో కంప్యూటర్, ఇల్లంటివి లేవు కదా… నేటి మానవుని కంటే మన మహర్షులు ఇంకా కొన్ని అడుగులు ముందుకు వేసి అనుభవాలు, మంచి, చెడులు, నివారణోపాయాలు కూడా చెప్పారు. వాటిని మనము తప్పక ఆచరించి ఫలితాలను అనుభావిచాలేకని వాదనలతో నిరుపించాలేము కదా…
రాహువు పార్ధివ నామ సంవత్సర, భాద్రపద శుక్ల పూర్ణిమ నాడు, పూర్వ భాద్ర నక్షత్రాన జన్మించాడు. కశ్యప ప్రజాపతికి అతని భార్య అయిన సింహికకి. అమృతము పంచె సమయములో అమృతము విష్ణుమూర్తి ఆజ్ఞ మీరి తాగినందుకు అతని శిరస్సు ఖండిచ బడినది. పాము రూపముగా చెప్పబడే రాహువు అమృత మహిమ వడలన తోక విడిపోయి కేతువుగా అవతరించాడని పురాణ కధనము.
కాల సర్ప యోగము:
కాల సర్ప యోగము అనగా రాహు, కేతువుల మధ్య మిగిలిన ఏడు గ్రహములు ఉండుట వలన ఏర్పడే యోగము. ఇందులో మంచి యోగములు ఉండవచ్చు, చేదు యోగములు ఉండవచ్చు. చెడు యోగము కలిగిన రాహు కేతువుల పూజ చేయించుకోవాలి. ఐ మనుష్యులకే కాదు, దేశానికి, రాష్ట్రాలకి కూడా ఉండవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాము:-
రాహువు, కేతువులు మిగిలిన గ్రహములకు వ్యతిరేక దిశలో నడచును. ఏడు గ్రహములు రాహువు ఉన్న దిశ వైపు నడచిన కాల సర్ప యోగము ఏర్పడును. ఇది భారతీయుల సిద్ధాంతము. యురేనస్, నేఫ్ద్తున్, ఫ్లుటో గ్రహములు రాహు కేతువుల కక్ష్య వెలుపల ఉన్న కాలసర్ప యోగము ఏర్పడుతుందని పాశ్చాత్యుల సిద్ధాంతము.
కాల సర్ప యోగ దోషములు:
రాహు, కేతులు 1 – 7 స్థానము నందు ఉంటె భార్య, భర్తల మధ్య విరోధము, అశాంతి, మనస్పర్థలు, చురుకు దానము లోపించుట జరుగును. ఒక్కోసారి వివాహ యోగము కూడా ఉండక పోవచ్చుని.
రాహు కేతువుల కాల సర్ప యోగాలు:
యోగ్దము అనేది మంచి, చెడు రెండు వుంటాయి. ఆ సమస్యల స్వరూపము తెలుసుకుందాము:
1 – 7 అనంత కాలసర్ప దోషము దీనివలన దాంపత్య జీవితములో ఇబ్బందులు ఎదురు అవుతాయి.
2 – 8 గుళిక కాలసర్ప దోషము దీనివలన కుటుంబ సమస్యలు, వాక్, ఆర్థిక సమస్యలు ఉంటాయి.
3 – 9 వాసుకి కాలసర్ప దోషము దీనివలన ఉపయోగము లేని ప్రయాణాలు, బంధువుల వలన బాధలు.
4 -10 శంఖపాల కాలసర్ప దోషము దీనివలన వాహనాలు, గృహ, భూమి సంబంధిత సమస్యలు.
5 -11 పద్మ కాలసర్ప దోషము దీనివలన సంతన సమస్యలు, ఆందోళనలు.
6 -12 మహాపద్మ కాలసర్ప దోషము దీనివలన నిద్ర లేకపోవటాము, శారీరిక, ఆర్థిక ఇబ్బందులు.
7 -1 తక్షక కాలసర్ప దోషము దీనివలన భార్య, భర్తల మధ్య విభేదాలు, వ్యాపార సమస్యలు.
8 -2 కర్కటక కాలసర్ప దోషము, దీనివలన నష్టాలు, ఆకస్మిక ప్రమాదాలు జరుగును.
9 -3 శంఖచూడ కాల సర్ప దోషము దీనివలన పూర్వ పుణ్య లోపమువల్ల సమస్యలీ, పెద్దల వల్ల సమస్యలు.
10 -4 ఘటక కాలసర్ప దోషము దీనివలన ఉద్యోగ సమస్యలు, హోదాలలో, గౌరవములలో లోపాలు.
11 -5 విషక్త కాలసర్ప దోషము దీనివలన వ్యాపార లాభాలలో సమస్యలు.
12 -6 శేషనాగ కాలసర్ప దోషము దీనివలన అధిక వ్యయము వలన కలిగే ఇబ్బందులు.
మరి కాలసర్ప యోగము వలన జరిగే మంచి ఏంటి..
ఈ యోగము జాతకుని కష్టించు వానిగాను, దైవ్దభక్తి గల వానిగాను, ధర్మ నిష్ఠ పరునిగాను, మార్చును.
జాతక చక్రములోని ఇతర దోషములు హరించును.
ఇతర గ్రహముల దోషములు కాలసర్ప యోగము వలన నిర్మూలించ బడును.
జాతకుని ముందుకు నడిపించి గొప్పతనము సాధించుటకు కావలసిన శక్తిని కలిగించును. ఎదుటి వారు కలుగ చేయు ఆపదలనుండి తప్పించుత్డకు శక్తిని ఇచ్చును.రాహువుతోగాని, రాహువుకు ముందు కాని గురు చంద్రుల కలయిక వలన మంచి యోగము కలుగును.
సవ్య, అపసవ్య కాలసర్ప దోషాలు ఉంటాయి. రాహువునుంచి కేతుగ్రహము వరకు సప్త గ్రహాలు ఉంటె అది సవ్య కాలసర్ప యోగము, కేతువు నుండి మొదలు అయి రహుగ్రహ మధ్యలో సప్త గ్రహాలు ఉంటె అపసవ్య కాలసర్ప యోగము అందురు.
ఇక మూడవది రాహు, కేతుల మధ్య లగ్నము ఉండి మిగిలిన సప్త గ్రహాలూ కేతు, రాహుల మధ్య ఉంటె అది లగ్న కాలసర్ప యోగము అందురు.
సర్పదోషము, నాగ దోషము: జోతిష్యములో రాహు, కేతువులను సర్పముగా భావితురు తల రాహువుగాను, తోక కేతువుగాను చెప్పుదురు. ఈ దోషములను నాగదోషముగా చెప్పుదురు. నాగ దోషము ఉన్నప్పుడు తప్పని సరిగా పుట్ట పూజలు, నగెర స్వామి గుడిలో పూజలు దర్శనములు, దానాలు పరిహార క్రియలు చేయాలి. అవి జతకములో గ్రహ స్తితి బట్టి నిర్ణయించాలి. నాగ దోషములు చెప్పబడే కొన్ని గ్రహ స్తితి గతులు:
జాతక చక్రములో లగ్నము నుండి ఆరు, ఏడు, ఎనిమిది స్థానాలలో రాహువు ఉంటె సర్ప దోషము. ఇతర ఏ యోగాలు లేకుండా ఈ దోషము ఉంటె దుష్కర్మల పట్ల ఆసక్తి, సుఖము లేక పోవుట, ఉద్యోగ సమస్యలు, కొందరికి వివాహము కాక పోవుట జరుగును.
జాతక చక్రములో చంద్రుని నుండి ఎనిమిదవ స్థానములో రాహువు కేతువు ఉంటె సర్ప దోషముగా చెప్పాలి.
జాతక చక్రములో రాహువు నుంచి ఎనిమిదవ స్తానములో రవి ఉంటె సర్ప దోషము.
జాతక చక్రములో లగ్నము నుండి త్రికోణము నందు కాని, కేంద్రము నందు కాని రాహు, కేతువులు ఉంటె సర్ప దోషము.
—————————
నాగ శాపం
నాగ దోషానికి పరిహారాలు నాగ ప్రతిష్ట మాత్రమే కాదు.ఈ దోషాన్ని పంబన్ ఘట్ అనే విధానం ద్వారా సరిచేయవచ్చు.కేరాలకి చెందిన నాగ వంశీకులు ఈ దోషాన్ని పరిపూర్ణంగా నిర్మూనించగలరు.త్రయంబకేశ్వర్ ,కుక్కి ,మన్నర్సాల,కౌలాలంపూర్ మున్నగు ప్రదేశాలలో ఈ దోషానికి పరిహారాలు అనగా తొమ్మిది గ్రహాలకి తొమ్మిది నాగులను నియమించబదిందని సర్ప శాస్త్రం తెలియబరుస్తుంది.మొదటిది ఆశ్లేష బాలి,నవనాగా మండలం,నారాయణ నాగాబలి,మహా సర్ప బలి ఈ నాలుగు రకాల పరిహారలతో తొమ్మిది రోజుల హోమమును చేయటం జరుగుతుంది.నాగ దోషం గల జాతకులు ధరించిన వస్త్రాలను ఉప హోమ గుండములో వేయటం జరుగుతుంది.జాతకుడు పుట్టిన సంఖ్యను బట్టి ఒక రంగు ఉద్దేశం అవుతుంది.ఆ రంగు వస్త్రాలను పూర్నాహుతిలో వేయటం జరుగుతుంది. ఈ తొమ్మిది రోజులు జాతకులు శాకాహారం మాత్రమె తీసుకోవాలి.పొట్లకాయ తినరాదు.ప్రతి నిత్యం సర్ప సూక్తం చదవాలి.ఇలా పరిహారాలు చేసుకునే వారికి శీఘ్ర సంతానం కలుగుతుంది.కోర్టు వ్యవహారాలూ,వ్యాపార సమస్యలు,అనారోగ్య సమస్యలు నయమవుతాయి.
స్వప్నంలో పాములు కలలోకి వస్తే అది సర్ప దోషమని సర్ప శాస్త్రం మనకి తెలియపరుస్తుంది.అలాంటి వారు కూడా దోష పరిహారము చేసుకొనుట మంచిది.
జాతకంలో లగ్నము నుండి 8వ స్తానంలో రాహువు ఉంటే లేదా శని ,రాహువు యొక్క దృష్టి 8వ స్థానం పై పడితే సర్పదోషం ఏర్పడుతుంది .రాహు కేతువుల లగ్నంలో కానీ , 2వ స్థానంలో కానీ ,5 వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ ,8వ స్థానంలో కానీ ఉంటే ఆ జాతకులకు సర్ప దోషం ఉందని గుర్తించాలి.ఏ సర్పదోషం ఎవరి జాతకంలో అయితే ఉంటుందో వారికి క్రింద వివరించబడిన సమస్యలు ఎదురవుతాయి. సర్పదోషాల వలన ఆయుహ్క్షీనమ్ , సంతానం కలగకపోవటం,సంతానం కలిగినా వెంటనే చనిపోవడం ,భార్య భర్తల మధ్య విభేధాలు ఏర్పడడం ,దంపతులకు విడాకులు తీసుకొనే పరిస్తితి ఏర్పడడం ,అకస్మాత్తు రోడ్డు ప్రమాదాలు జరగడం, గర్భస్రావాలు జరగడం,వివాహం ఆలస్యంగా జరగడం,మాంగల్య దోషం లాంటి సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.
ఇదే కాక రాహు కేతుల స్థానాలను బట్టి పన్నెండు రకాల కాల సర్ప యోగాలను జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది. ఈ పన్నెండు రకాల కాల సర్ప యోగాల వలన విభిన్న సమస్యలు ఏర్పడతాయి.ఏ యోగం ఏ జాతకులకు ఉంటుందో క్రింద వివరించబడింది.
జాతక చక్రంలో లగ్నంలో అనగా ఒకటవ స్థానంలో రాహువు మరియు 7వ స్థానం కేతువు ఉన్నట్లైతే ఈ జాతకులకు “ అనంత కాలసర్ప యోగం”గా భావించాలి. ఈ యోగం వలన వీరి దాంపత్య జీవితంలో విబేధాలు ఏర్పడతాయి. తప్పు నిర్ణయాలు తీసుకొని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
జాతక చక్రంలో లగ్నం నుండి 2వ స్థానంలో రాహువు మరియు 8వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “కులిక కాలసర్ప యోగం”గా గుర్తించాలి.దీని వలన వీరికి సంపాదన తక్కువగా ఉంటుంది.అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదాలు మరియు అకాల మరణాలు సంభవిస్తాయి.
జాతక చక్రంలో లగ్నం నుండి 3వ స్థానంలో రాహువు మరియు 9వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “వాసుకి కాలసర్ప యోగం”గా గుర్తించాలి. ఈ జాతకులకు ఆత్మ గౌరవం తగ్గి సంఘం లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు.ఆత్మహత్యలకు పాల్పడతారు.సోదరులతో విబేధాలు ఏర్పడతాయి.విదేశాలకు వెళ్ళుటకు ఇబ్బందులు ఎదుర్కొంటారు.
జాతక చక్రంలో లగ్నం నుండి 4వస్థానంలో రాహువు మరియు 10వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “శంఖ పాల కాలసర్ప యోగం”గా గుర్తించాలి. ఈ జాతకులు అందరినీ దుర్భాషలడతారు. జాతకుని తల్లికి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి.ఉద్యోగంలో లేదా వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటారు.వాస్తు సరిగ్గా లేని ఇంటిలో నివసిస్తూ అధిక సమస్యలకు గురి అవుతారు.
జాతక చక్రంలో లగ్నం నుండి 5వ స్థానంలో రాహువు మరియు 11వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “పద్మ కాలసర్ప యోగం” వీరికి వ్యాపారంలో నష్టాలు ఎదురవుతాయి. స్నేహితుల వలన సమస్యలు వస్తాయి. సంతానంలో కొరత లేదా ఆలస్యం ఏర్పడుతుంది.
జాతక చక్రంలో లగ్నం నుండి 6వ స్థానంలో రాహువు మరియు 12వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “మహా పద్మ కాలసర్ప యోగం”గా గుర్తించాలి. ఈ జాతకులకు శత్రువులు ఎక్కువగా ఉంటారు.అనారోగ్యాల పాలవుతు ఉంటారు.ఏకాంతంగా మిగిలిపోవడం,జైలు పాలవడం లాంటివి జరిగే సూచనలు ఉన్నాయి.
v జాతక చక్రంలో లగ్నం నుండి 7వ స్థానంలో రాహువు మరియు లగ్నంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “తక్షక కాల సర్ప యోగం”గా గుర్తించాలి.ఈ జాతకుల జీవిత భాగస్వామి చెడు ప్రవర్తన గలవారై ఉంటారు.పరిస్థితులు వీరిని వైరాగ్యానికి గురి చేస్తాయి.
జాతక చక్రంలో లగ్నం నుండి 8వ స్థానంలో రాహువు మరియు 2వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “కర్కోటక కాల సర్ప యోగం”గా గుర్తించాలి.ఈ జాతకులు నిరంతర అనారోగ్యంతో భాదపడతారు.సంపదకు మించి ఖర్చులు పెరిగిపోవడంతో అప్పుల పాలవుతారు .
v జాతక చక్రంలో లగ్నం నుండి 9వ స్థానంలో రాహువు మరియు 3వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “శంఖాహూడ కాల సర్ప యోగం”గా గుర్తించాలి.ఈ జాతకులు అన్నీ రకాల చెడు వ్యసనాలకు అలవాటు పది ఉంటారు.వీరికి ఉన్న ఆస్తి మరియు సంపదను కోల్పోతారు. విదేశాలకు వెళ్ళుట కష్టంగా మారుతుంది.ప్రయాణాలలో సమస్యలు వస్తాయి .
v జాతక చక్రంలో లగ్నం నుండి 10వ స్థానంలో రాహువు మరియు 4వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “ఘాతక కాలసర్ప యోగం”గా గుర్తించాలి.ఈ జాతకంలో వారు చేసే ఉద్యోగంలో కానీ ,వ్యాపారంలో కానీ సరిగ్గా రాణించలేరు. వీరి కుటుంబ సభ్యులలో ఒకరు మాంత్రికుడిగా మారి క్షుద్ర పూజలు ప్రయోగించి ఇతరులను కష్టాలకు గురి చేస్తారు.
v జాతక చక్రంలో లగ్నం నుండి 11వ స్థానంలో రాహువు మరియు 5వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకి “విశాధర కాల సర్ప యోగం”గా గుర్తించాలి.ఈ జాతకులు వీరి కన్నా అగ్రజులైనా సోదరి లేక సోదరులతో విబేధాలు ఏర్పడతాయి.స్నేహితుల వలన సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.సంధిగ్ధమైన మనస్సు కలిగి ఉండడం వలన వ్యాపారాలలో నష్టాలు ఏర్పడతాయి.అప్పులు చేసి ఆస్తి పోగొట్టుకొంటారు.
v జాతక చక్రంలో లగ్నం నుండి 12వస్థానంలో రాహువు మరియు 6వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “శేషనాగు కాల సర్ప యోగం”గా గుర్తించాలి.ఈ జాతకులు సంపాదనకు మించి ఖర్చును చేస్తారు.వీరికి వీడని అనారోగ్య సంశ్యాలు ఏర్పడతాయి.జైలు పాలయ్యే అవకాశాలు వస్తాయి.వీరికి తెలియని శత్రువులు హాని చేయడానికి ప్రయత్నిస్తారు.
జాతక భావంలో ఉన్న ఈ నాగ శాపం,సర్ప దోషం,కాల సర్ప దోషం యొక్క ప్రభావల నుండి వచె సమస్యలు తొలగించుకోడానికి సర్ప శాస్త్ర విధానాన్ని అవలంబించి కేరళలో ఉన్న మన్నర్షాల మరియు పాంబు మెక్కట్టు లో ఆశ్లేష బలి,నారాయణ నాగ బలి,మహా సర్ప బలి,నవనాగ మండలం అను పరిహారాలు జాతకుని ఫోటో,జన్మ నక్ష్త్రమ్,జన్మ లగ్నం,మేనమాల గోత్రం,జాతకులు వాడిన వస్త్రం మొదలగు వాటిని సేకరించి ఈ పరిహారాలు జరుపుతారు.ఈ పరిహారాలు నాలుగు రోజులు జరుగుతాయి.ఈ నాలుగు రోజులు ప్రతి నిత్యం ఏదో ఒక సమయంలో నైనా ఏ ప్రదేశంలో నైనా సర్ప సూక్తాన్ని భక్తి శ్రద్ధలతో చదవాలి.
——————————————–
నాగ దోషం ,కాల సర్ప దోషం నివారనోపాయలు
కాల సర్పం యోగం పట్టినవారు.సప్తమ,అష్ట్టమాల్లో రాహు కేతువులు ఉన్నవారు.పూర్వ జన్మలో పాములను చంపినా వారు లేదా మంత్ర తంత్ర విధి విధానాలతో బంధించినవారు,పాముల పుట్టలను త్ర్రావ్వి ఇండ్లు కట్టిన వారు నాగదోషం కలవారై పుడుతారు.అటువంటి వారు వివాహం,సంతానం,కుటుంబ అభివృద్ధి విషయాల్లో అడ్డంకులు,అవమానాలు పొంది,విరక్తి కలిగి జీవితం అంతం చేసుకొందమనే స్తితికి వస్తారు..
1.నాగదోషం త్రీవ్రమైనది అయితే శుక్ల పౌడ్యమినాడు శ్రీకాళహస్తిలో నిద్రచేసి మరుసటి దినం శివ దర్శనం చేసి పూజలు జరిపించుట వల్ల నివారణ కల్గుతుంది
2.ఆరు ముఖాల రుద్రాఅక్షాలు చెవులకు లేదా గాజులలకు లేదా ఉంగరంగా ధరించుట వల్ల ,ఏనుగు తోక వెంట్రుకలు ఉంగరంగా లేదా చేతికి కడియంగా ధరించుట వల్ల నివారణ పొందగలరు
3.నాగ ప్రతిమకు 27 దినాలు పూజచేసి దేవాలయమునకు దానం చేయవలేయును.
4. రాహు కాలంనందు ప్రతి సోమవారం నాగ దేవతకు క్షేరాన్ని నివేదన చేసి పూజ చేయాలి. లేదా రాహు కాలంనందు నాగ దేవతకు క్షేరాన్ని నివేదన చేసి నవగ్రహ ఆలయంలో దానంగా ఇచ్చుట వల్ల నివారణ కల్గును
5.త్రీవ్ర్రమైన నాగదోషంఉన్న యడల నాగ పంచమి రోజున శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించి దుర్గ, పాతాళ వినాయకుని దర్శించి పూజించటం వల్ల నివారణా కల్గును
———————————————————
పితృ దోషం ఎటుల ఏర్పడుతుంది
పితృ దోషం ఉండే వాళ్ళకు జీవితంలో అనేక కష్ట నష్టములు ఎదుర్కోవలసి వస్తుంది పిత్రుదోషం కుటుంబమందు ఎదో ఒక్కరికి సంప్రాప్తించును అసలు పితృ దోషం ఎందుకు వస్తుంది అనేది చూద్దాము.
కుటుంబమున ఎవరో ఒకరు అదే అత్తో మామో చిన్ననో పెదనాన్నో అన్నానో తమ్ముడో చెల్లియో అక్కయో వారికి నిర్దేసించ బడిన ఆయుస్సుకు ముందే ఆత్మాహుతి అంటే ఆత్మ హత్య చేసుకోవడమో ఆక్సిడెంట్ వాళ్ళ చనిపోవడమో లేక ఇతర కారణముల వాళ్ళ ముందే చనిపోతే వారి ఆయుస్సు నిర్దేశించబడిన వరకు ప్రేతత్వములో తిరుగుతో వుంటారు. అలాంటి వారికి అపర కర్మ లేదు చాల తంతు అంటే పరిహారడులు చేసి తర్వాత ప్రేత కర్మ చేయవలసి వుంటుంది. అలా చేయకపోతే ఇక్కడే తిరుగుతూ ఆకలి డప్పులకు అలమటిస్తూ మనలను శపిస్తూ తిరుగుతుంటారు.
ఇలా ఒక కుటుంబంలో ఎన్ని మనదో అపమ్రుత్యు వాత పడ్డ వారి లెక్క మనకు తెలీకుండా వుంటుంది. అలాంటి శాపం వల్లే కుటుంబములో ఏదో ఒక పిల్ల వాడికో లేక పిల్లకో పితృ దోషంతో పుడుతుంటారు. ఇక వారి జీవితం అంట కష్ట మయంగానే వుంటుంది. అసలు ఈ పితృ దోషం తెలుసుకోవలసింది ఎటుల అంటే జాతకంలో రాహు కేతువుల మద్య అన్ని గ్రహములు ఇమిడి వుంటారు. అలాంటప్పుడు అది కాల సర్ప దోషం అని జాతక రీత్యా అంటారు. అది పితృ దోషం వాళ్ళ వస్తుంది. ఈ దోష్సం లేకుండా ఇంట్లో పిల్లలు వుండరు.
కాల సర్ప దోష నివారణకు ముఖ్యమైనది పెద్దలు ఇంట్లో పితరులకు తర్పనాదులు మరియు శ్రాద్హ కర్మలు తప్పకుండ వదలకుండా చేయడం వాళ్ళ కొంత తగ్గుతుంది. మరి రాహు ప్రీతి కొరకు దుర్గను కేతు ప్రీతి కొరకు గణేశుని ప్రార్తించ వలసి వుంటుంది. అందుకే మన శాస్త్ర సంప్రదాయములో కలౌ చండి వినయకౌ అని అంటారు. ఈ రెండు దేవతలు త్వరగా ప్రీతిపాత్రులై మనకు మంచి కలుగ చేస్తారు.

Saturday, 21 October 2017

వైఖానస ఆగమం.......

వైఖానస ఆగమం......
శ్రీ లక్ష్మీ వల్లభారంభాం విఖనో ముని మధ్యమామ్ |
అస్మదాచార్య పర్యంతాం వన్దే గురు పరంపరామ్ ||
శ్రీమహావిష్ణువుని ప్రప్రథమంగా అర్చన చేసిన మహర్షి విఖనస మహర్షి అందుచే వారి వంసానుగమంగా విఖనసునికి జన్మించిన పుత్ర సంతతిని వైఖానసులు అంటారు. వీరు ఇంద్రునికి అత్యంత ప్రీతిపాత్రులు. నిత్యం శ్రీపతిని పూజించేవారు.
నారాయణః పితా యస్య మాతా చాపి హరిప్రియా |
భ్రుగ్వాది మునయః శిష్యా తస్మై శ్రీ విఖనసే నమః ||
ఆనందితాచార్య మనన్య భాజనం సుత్ర్యైక నిష్టం కరణ త్రాయేణా |
అనారతం శ్రీపతి పాద పద్మయో: నమామి వైఖానస మాది వైష్ణవం ||
శ్రీమద్రామానుజాచార్యుల వారు వైఖానుసుల యొక్క విశిష్టతను కీర్తిస్తూ తెలిపిన శ్లోకం ఇది. ఏ సుత్రమైతే నిందించటానికి శక్యము కానిదో, ఎవరైతే దైవిక, శ్రౌత, శారీరక కర్మలను ఒకే సూత్రము ద్వారా నిత్యమూ శ్రీపతి ఐన శ్రీమహావిష్ణువు యొక్క పాద పద్మములను ఆరాదించినారో వారే వైష్ణవ సంప్రదాయానికి నాంది పలికింది. వారే ఆది వైష్ణవులు.వారే వైఖానసులు.
విష్ణువుని ముఖ్య దైవంగా కొలిచే వైఖానసులు ఇప్పటికీ తమ యొక్క వైఖానస భగవత్ శాస్త్రం అనే ప్రాథమిక గ్రంధం ఆధారంగా తిరుమలలో వేంకటేశ్వరునికి, శ్రీరంగంలో శ్రీరంగనాధునికి మరియు ఇతర ప్రముఖ వైష్ణవ ఆలయాలలో నిత్యపూజలను అందిస్తున్నారు.
వైఖానసులు, వారి నమ్మకం ప్రకారం, వైదిక సాంప్రదాయమైన కృష్ణ యజుర్వేదీయ తైత్తీరియ శాఖను పాటించే జీవిత సమూహం. వైఖానస సాంప్రదాయం ప్రకారం ఋషివిఖనసుడు మహావిష్ణువు యొక్క అంశతో మహావిష్ణువుకే జన్మించాడు. బ్రహ్మతో పాటుగానే ఇతనికి ఉపనయనం జరిగింది. మహావిష్ణువే గురువుగా సమస్త వేదాలు, మరియు భగవత్ శాస్త్రాన్ని అభ్యసిస్తాడు. ఆపై భూమి మీదకి నైమిశారణ్యం వద్దకు వస్తాడు. అక్కడ వైఖానస కల్పసూత్రాన్ని రచించి తన నలుగురు శిష్యులైన అత్రి, భృగువు, కశ్యపుడు మరియు మరీచికి ఉపదేశిస్తాడు. అత్రికి సమూర్తార్చన, భృగువుకి అమూర్తార్చన, కశ్యపుడికి తర్కం-జపం, మరియు మరీచికి అగ్ని హుతం పై ఉపదేశాలు చేస్తాడు. వైఖానసుల ప్రకారం వైదిక హవిస్సు క్రతువునే వీరు కొనసాగిస్తున్నారు. యాగం చేస్తూ అగ్నిలో హవిస్సులు పోస్తే వచ్చే ఫలితమే వైష్ణవారాధాన ద్వారా వస్తుందని నమ్ముతారు.
వీరు ముఖ్యంగా విష్ణువు యొక్క ఐదు రూపాలను కొలుసారు.
విష్ణువు – సర్వాంతార్యామియైన దేవాదిదేవుడు
పురుషుడు – జీవితం యొక్క సూత్రము
సత్యము – దైవం యొక్క మారని అంశం
అచ్యుతుడు – మార్పు చెందని వాడు
అనిరుద్ధుడు – ఎన్నటికీ తరగని వాడు
‘ఏ నఖాః తే వైఖానసాః ఏ వాలాః తే వాలఖిల్యాః‘ అన్న వేదశృతి వాక్యానుసారంగా ఎవరైతే అనఖా: అనగా పాపరహితులో వారే వైఖానసులు. వైఖానసాగమాను సారంగా జీవన శైలి కలిగియున్న వారిని ప్రత్యేకంగా వైఖానసులు అంటారు అలా ఎందుకనగా
శ్లోకం :
యే వైఖానస సూత్రేణ సంస్కృతాస్తు ద్విజాతయః
తే విష్ణు స దృశా జ్ఞేయం సర్వేషాం ఉత్తమోత్తమం |
వైఖానసానాం సర్వేషాం గర్భ వైష్ణవ జన్మనాం
నారాయణః స్వయం గర్భే ముద్రాం ధరాయేత్ నిజాం ||
వైఖానసులు ఒక తపస్సంపన్నుల సమూహం. వీరి ప్రస్తావన మొదటి సారిగా మనుధర్మశాస్త్రంలో వస్తుంది. మనువు మనిషి యొక్క వర్ణాశ్రమంలోని ఆఖరి రెండు చరమాంకాలయిన వానప్రస్థం ఇంకా సన్యాసాశ్రమం గురించి చెబుతూ వైఖానస నిబంధనను తెలుపుతాడు. తద్వారా వైఖానస సముదాయం ఆ కాలానికే ఉందని తెలుస్తుంది. నారాయణీయంలో కూడా వీరి ప్రస్తావన వస్తుంది. కానీ సైద్ధాంతికంగా వైఖానస సూత్రాలు నాలుగోశతాబ్దికన్నా పాతవి కావని తెలుస్తోంది. ఎనిమిదవ శతాబ్దం నాటి ఆలయ శిలాశాసనాల ద్వారా వైఖానసులు పూజారులని తెలుస్తోంది. వైఖానసులు పూజారిలే కాక దేవాలయంలో ధర్మకర్తల బాధ్యతలు కూడా నిర్వహించేవారు. గుడికి సంబంధించిన ఆస్తులకు జవాబుదారీగా ఉండే వారు. శ్రీవైష్ణవుల రాకతో వైఖానసుల ప్రాభవం తగ్గిపోయింది. రామానుజాచార్యుడి రాకతో ఈ ప్రాభవం మరింత తగ్గింది. రామానుజులు దేవాలయ పూజారి వ్యవస్థను రూపుమాపు చేసాడు. అయిదు స్థాయిలలో ఉన్నది పది స్థాయిలకు మార్చాడు (ప్రధానార్చకుడు-అర్చకుడు-తీర్థం (నీరు) తెచ్చే వ్యక్తి - వంట చేసే వ్యక్తి - ఘంటారావం చేసే వ్యక్తి ఉన్న వ్యవస్థ నుండి శూద్రులకు స్థానం కల్పిస్తూ నిర్మాల్యం తొలగించడం-పాలుపూలుపళ్ళు తేవడం- ఉత్సవ పల్లకీ మోయడం - గుడిలో తులసీవనం పోషించడం మొ॥ ఉన్న వ్యవస్థను నెలకొల్పడం). ఈ విధంగా శూద్రులకు ఎన్నడూలేని స్థానం దేవాలయంలో దక్కినప్పటికీ వైఖానసుల అవసరం తగ్గలేదు. ఈనాడు ప్రముఖ వైష్ణవ దేవాలయాలన్నిటిలోనూ ప్రధానార్చకులుగా వైఖానసులే ఉంటారు.
వైఖానస-పాంచరాత్ర వైరం.....
ఒక కథనం ప్రకారం శైవుల రాక వలన వైఖానసులంతా తిరుమల ఆలయం చేరతారు. వీరు వీడి వచ్చిన ఆలయాలన్నీ అప్పటి చోళ రాజు స్వాధీనం చేసుకుని శైవాలయాలుగా మార్చివేస్తాడు. కొద్ది కాలానికి ఆ ఆలయాలలో తిరిగి వైష్ణవ పూజలను రామానుజుల ఆధ్వర్యంలో శ్రీవైష్ణవులు కొనసాగిస్తారు. అంతలోనే అందరు వైఖానసులు నరికివేయబడతారు. అది చోళరాజు చేయించినదా లేక రామానుజులు చేయించిన చర్యనా అన్నది ఎవరికీ తెలీదు. ఆ విధంగా ఒక్క వైఖానస పురుషుడు కూడా మిగలకుండా అవుతుంది. అప్పుడు రామానుజులు వేంకటేశ్వర స్వామిని సమీపించి పూజాపునస్కారాల విషయమై చర్చిస్తూ, శ్రీవైష్ణవుల ఆధ్వర్యంలో పూజలు జరగాలని స్వామి వారిని కోరతాడు. కానీ స్వామివారు ఒక వైఖానస బాలకుడి విషయం తెలిపి అతనికి ఉపనయనం చేయించి అతని చేతనే పూజలు జరిపించాలని కోరతాడు. రామానుజులు ఈ విషయమై విముఖంగా ఉంటాడు. పాంచరాత్రాగమంలోనే పూజలు జరగాలన్నది ఆయన ఆశయం. ఈ బాలుణ్ణి కూడా హతమార్చాలని పన్నాగం జరుగుతుంది. స్వామి పుష్కరిణిలో మునిగి తేలగానే ఆ బాలుడు వటువుగా మారిపోతాడు. స్వామివారి వైభవం తెలుసుకున్న ఇతరులు, రామానుజులు తిరుమల పూజలను తిరిగి వైఖానసులకే అప్పగిస్తాడు. అప్పటి నుండి తిరుమల ఆలయం మొదలు చాలా ఆలయాల్లో వైఖానస-శ్రీవైష్ణవ వైరం ముందుకొస్తుంది. నేటికీ కొన్ని ఆలయాలలో ప్రధానార్చకత్వంపై వివాదాలున్నాయి. అయినా శ్రీరంగంలోని రామానుజుల పార్థివశరీరమూర్తి అని చెప్పబడే తాన్ ఆన తిరుమేణికి పూజ చేసేది వైఖానసులే.

Monday, 11 September 2017

కావేరి నది పుష్కరాలు..........

కావేరి నది పుష్కరాలు..........
గంగానది తర్వాత అంతటి పవిత్రమైనదిగా భావించే నది కావేరి. అందుకే కావేరిని దక్షిణ గంగ అని పిలుస్తారు. దేవగురువైన బృహస్పతి తులారాశిలో ప్రవేశించడంతో కావేరీనదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. బృహస్పతి ఈ సెప్టెంబర్‌ 12న కన్యారాశి నుంచి తులారాశిలో ప్రవేశం కాబట్టి ఈ 12 రోజులూ ఆ నది పుష్కర శోభను సంతరించుకుంటుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు కావేరీ పుష్కరాలలో పుణ్యస్నానాలు చేసి పునీతులవుతారు. నర్మదా నదీతీరంలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశీక్షేత్రంలో మరణించడం వల్ల కలిగే ఫలం కేవలం పుష్కర స్నానం వల్ల కలుగుతుందని పురాణోక్తి.
ఎక్కడ పుట్టింది?
పూర్వం బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో కావేరుడనే రాజు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో బ్రహ్మని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు మెచ్చి, ఓ అందాల పాపను ప్రసాదించాడు. కావేరి అని పేరు పెట్టుకుని రాజు ఆ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. యుక్తవయసు రాగానే ఆమెను అగస్త్య మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. వివాహ సమయంలో తనను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టకూడదని అగస్త్యుని కోరింది కావేరి. అంగీకరించాముని.
అగస్త్యుడు ఓ రోజున తన శిష్యులకు తత్త్వశాస్త్ర రహస్యాలను బోధించడం కోసం శిష్యులను దూరంగా తీసుకెళ్లి పాఠాలు చెబుతున్నాడు. భర్త తనను విడిచి వెళ్లడంతో కావేరి కోపంతో ఒక తటాకంలో దూకింది. అయితే, ఆమె బ్రహ్మవర ప్రసాదిని కావడంతో మరణించడానికి బదులు నదిగా మారిపోయి బ్రహ్మగిరి పర్వతాల మీదుగా ప్రవహిస్తూ వెళ్లింది. ఆమే కావేరీ నదిగా ప్రసిద్ధికెక్కింది.మరో కథ ఏమిటంటే, తనని విడిచి ఉండరాదన్న భార్య కోరికను మన్నించి అగస్త్యుడు ఆమెను జలరూపంలోకి మార్చి తన కమండలంలో ఉంచుకుని ఎల్లప్పుడూ తనవద్దే ఉంచుకునేవాడు. అయితే, ఒకసారి ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైన క్షామం వచ్చింది. వర్షాలు లేక జలాశయాలన్నీ ఎండిపోయాయి. పంటలు పండక ప్రజలు అల్లాడుతూ, విఘ్నేశ్వరుని ప్రార్థించారు.
వినాయకుడు ఆవు రూపంలో అగస్త్యుని వద్దకు వచ్చి, గడ్డిమేస్తున్నట్లు నటిస్తూ, కమండలాన్ని తన ముట్టెతో కింద పడేలా చేశాడు. దాంతో కావేరి కాస్తా నదీరూపాన్ని సంతరించుకుని, అక్కడినుంచి తన పుట్టినిల్లైన బ్రహ్మగిరి వరకూ ప్రవహించింది.
కావేరీ పుష్కర స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం.
పుష్కర స్నాన విధి
ముందుగా పుష్కర నదికి ప్రార్థన చేసి తీరంలో ఉండి మట్టిని మూడుసార్లు నీటిలో వేసి తరువాత సంకల్ప సహితంగా పుష్కర స్నానం చేయాలి. పితృదేవతలకు తర్పణం, తీర్థోపవాసం చేయాలి. మృత్తికా స్నానం, పుష్కర స్నానం చేసి ముక్కోటి దేవతలకు, మునులకు తర్పణ విడవాలి. మళ్లీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి. దీర్ఘాయువునిచ్చే నదీపూజలు: పుష్కర యాత్రలు చేసిన వారికి, నదీ పూజలు నిర్వహించిన వారివి వ్యాధులు, పాపాలూ తొలగి, దీర్ఘాయుష్షు లభిస్తుందని పురాణగాథలు విదితం చేస్తున్నాయి.
ఏమిటీ పుష్కరం?
పుష్కరం అంటే పన్నెండేళ్ల కాలం. దేవ గురువు బృహస్పతి తులారాశిలోకి ప్రవేశించినప్పుడు కావేరికి పుష్కరాలు వస్తాయి. ఈ సమయంలో నదికి ఆధి దైవిక శక్తులు వస్తాయి. ఈ çసమయంలో స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్ఠానాలకు, పితృపిండ ప్రదానానికి అక్షయమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. ఈ కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయి.
కర్నాటక రాష్ట్రంలో శ్రీరంగపట్నం, మైసూరు, శ్రావణబెల్
గోల, ధర్మస్థలం, వర్నాడు, కొక్కిసుబ్రమణ్యం, ఉడిపి, శృంగేరి, గోకర్ణం లాంటి మహా పుణ్యక్షేత్రాలు
తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం, జంబుకేశ్వరం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, తిరుచెందూరు, చిదంబరం, కుంబకోణం వంటి పుణ్యక్షేత్రాలు.
కావేరీ నదీ పుష్కరాల వివరాలు*
12-09-2017 నుండి 23-09-2017 వరకు
కావేరీనదిని దక్షిణ గంగ అని పిలుస్తారు.
సహ్యపర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,320 మీటర్ల ఎత్తున మైసూర్లోని బ్రహ్మగిరి కొండపై కావేరి ఆవిర్భవించింది. *కొడుగు లేదా కూర్గు* అనే ప్రాంతం ఈనదికి రూపకల్పన చేస్తుంది. కావున ఈ నది ‘‘కూర్గుకువూరి’’ అని కావేరి ఉద్భవించే ప్రదేశాన్ని తలక్కాలేరా అని అంటారు. కావేరీ పుట్టెచోట ఒకచిన్న తొట్టె ఆకారంలో ఉంటుంది.
ఈతలక్కామేరీలో కావేరీమాత పెద్ద విగ్రహం ఉంది. కావేరీ దేవతగా భక్తులు పిలుస్తారు. భక్తుల కోర్కెతీర్చే ఇలవేల్పుగా కావేరీ దేవత పేరు పొందినది. ఈ దేవతకు ప్రతిఏటా శ్రావణమాసంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది.
దక్షిణగంగగా పేరుపొందిన కావేరికి షింసా, భవాని అనే రెండు ముఖ్యమైన ఉపనదులు చెప్పబడుతున్నాయి.
ఇవికాక కనక, సుజోజ్యోతి, హేమావతి, లోకాపాము, అర్ఖావతి, తొప్పైయ్యేరు శరభంగ, మణిమధుర, హాళే, సాగరఘాటె, లక్ష్మణతీర్థ, కాబినికుండల, అమరావతి మొదలగు చిన్నపెద్ద మొత్తం కలిసి 50కిపైగా కావేరికి ఉపనదులు ఉన్నాయి.
వీటివల్ల కావేరివెడల్పు పెరిగి ప్రవహిస్తుంది. 
కావేరి పరివాహక ప్రాంతం అంతా సస్యశ్యామలం. అందుకే కావేరీని ‘‘పొన్ని’’ అని అంటారు.
పొన్ని అంటే ధాన్యం అని బంగారు అని రెండు అర్థాలు. ఈ నది ధాన్యసమృద్ధి కలిగించేది, బంగారు పంటలు పండిచేదని ఈ కావేరినదికి పేరు.
కూర్గుకొండల్లో జన్మించి కొంతదూరం పర్వతసీమలందే ప్రవహించి తర్వాత ఆగ్నేయదిశగా ప్రవహించి మైసూరు రాష్ట్రంలో పీఠభూమి దశవదిలి క్రిందన గల పల్లంలోనికి శివసముద్రంవద్ద దూకుతుంది. ఇక్కడ కావేరి రెండుగా చీలుతుంది. ఈ రెండు చీలకల పేర్లు పరుచుక్కి, గగనచుక్కి అని పిలుస్తారు. పరచుక్కి 230 అడుగులు క్రిందకి ఒక జలపాతంలా పడుతుంది.
గగనచుక్కి అద్భుతంగా 90 కి.మీ. కొండచరియల్లోకిపడి కావేరీనదీ అలసటలేకుండా ప్రవహిస్తుంది. శివసముద్రం దాటిన తర్వాత కావేరి తమిళనాడు రాష్ట్రంలో ప్రవేశించి, తంజావూరు జిల్లాలో అధికశాతం ప్రవహించి కావేరి అక్కడనుండి మరికొంతదూరం సాగి బంగాళాఖాతంలో కలుస్తుంది.
స్నానయోగ్యమైన కావేరి నదీతీర పుణ్యక్షేత్రాలు.
*చిదంబరం*
అతిప్రాచీన దేవాలయం, శివుడు ప్రళయతాండవం చేస్తున్న అతిపెద్ద విగ్రహం.
నాలుగుదిక్కులు నాలుగు రాజగోపురాలు నటరాజస్వామి ఆలయంలో ఆలయంలోని నృత్యమందిరంలో ఎన్నో నృత్యభంగిమలు వందలకొలది వున్నాయి.
వెయ్యి స్తంభాల మంటపం అత్యుద్భుతంగావుంది. ఈక్షేత్రం పంచలింగాల్లో ఒక్కటైన ఆకాశలింగము ఉంది. ఈ క్షేత్రం తంజావూరుకు 106 కి.మీ. దూరంలో ఉంది. ఈ క్షేత్రం కావేరినది ఒడ్డునవుంది.
*శ్రీరంగం* :
ఈ క్షేత్రములో రంగనాధులు, రంగనాయకలు ప్రదానదేవతలు. ధనుర్మాసంలో గొప్పగా ఉత్సవాలు జరుగుతాయి.
ఈ క్షేత్రంలో 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో, 24 మంటపాలతోపాటు వేయిస్తంభాల మంటపం కల్గిన అతిపెద్ద వైష్ణవక్షేత్రం.
ఈ క్షేత్రాన్ని మద్రాసు బెంగుళూరు నుండి రైలుమార్గాలు కలవు. ఈక్షేత్రం తిరుచినాపల్లి (తిరుచ్చి) ప్రక్కన కావేరి నది ఒడ్డున కలదు.
*తంజావూరు*
చోళరాజులునిర్మించారు. ఇక్కడ స్వామి బృహదీశ్వరేశ్వరుడు. అమ్మవారు బృహన్మాక, గర్భాలయం 81 టన్నుల గొప్ప శిలలతో నిర్మితమైనది. శ్రీరంగం క్షేత్రమునకు సుమారుగా 90 కి.మీ దూరం ఈ క్షేత్రం కలదు.
*కుంభకోణం*
ఈ ప్రాంత చోళరాజులు పరిపాలించిన ప్రదేశం. ఈక్షేత్రంలో ప్రసిద్ధిమైన 4 విష్ణాలయములు, 12 శివాలయములు వున్నది.
కుంభకోణ క్షేత్రమంతా దేవాలయాల సముదాయమే. ఈ క్షేత్రం *తంజావూరు*నుండి 38 కి.మీ. దూరంలో ఉన్నది.

Thursday, 7 September 2017

శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంకొరకు........

శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంకొరకు........
శాస్త్రాలలో “ధర్మార్ధ, కామ, మోక్షాణా౦ పురుషార్ధ చతుష్టయం”.... అని మానవుని ఉన్నతిని కోరి నాలుగు రకాల పురుషార్ధములను చెప్పారు. వాటిలో మొదటిది ధర్మం, రెండవది అర్ధం, మూడవది కామం (కోరికలు, సంతానం), నాలుగవది మోక్ష ప్రాప్తికి తగిన సాధనాలు.
జీవితంలో ధర్మానికి ప్రధమ స్థానం ఇవ్వాలని, దానికి పెద్ద పీట వేయాలని, ధర్మ నియమాలను పాటించాలని, దైవం పట్ల, గురువుల పట్ల, గౌరవం, శ్రద్ధ వుండాలని మనకు శాస్త్రములు చెబుతున్నాయి. ధర్మాన్ని పాటిస్తూ లక్ష్మి సాధన ప్రాప్తి ఎలా పొందగాలమో ఇప్పుడు మనము తెలుసుకొందాము.
ధర్మము నుండే సంపద లబిస్తుంది. కానీ దానికి తోడూ సంపద కోసం ఈ పరుగుల జీవితములో, పోటీ ప్రపంచములో వ్యాపారం లేదా ఇతర పనుల ద్వారా ధనమును సంపాదించడానికి కొన్ని విశేష సాధనాలు, ప్రక్రియలు మనకు తంత్ర శాస్త్రములలో, వేదములలో, పురాణములలో చెప్పబడినవి.
దేవతలలో శ్రేష్టుడైన విష్ణు భగవానుని భార్యగా లక్ష్మి దేవికి స్థానం. శాస్త్రాలు ఆమె గొప్పతనాన్ని, మహత్వాన్ని చాటి చెప్పినాయి. లక్ష్మి యొక్క ఉపాసన మన జీవితాలలో ఎంతో ఆవశ్యకమైన ఉపాసన అనేది స్పష్టమైన మాట. అయితే ఇతరులను మోసగించి, అనైతిక మార్గముల ద్వారా ధనాన్ని సంపాదించ కూడదు. గౌరవముగా శాస్త్ర నియమాలకు లోబడి, ధర్మ మార్గములో శ్రమించి ధనాన్ని సంపాదించాలి. ధనవంతుడు లక్షాధికారి కావడం నేరము కాదు, అధర్మం కాదు. దారిద్ర్యాన్ని పారద్రోలడమే శ్రీ లక్ష్మీ ఉపాసన. వేద సమ్మతమైన, శాస్త్ర సమ్మతమైన మార్గములలో శ్రీ లక్ష్మీ సాధన చేసి, శ్రీ మహా లక్ష్మి అనుగ్రహము ఎలా పొందడము అనేది ఈ శీర్షిక ముఖ్య ఉద్దేశ్యము. మన జీవితాలను సుఖమయం చేసుకోవడం ఎలాగా? శ్రీ మహాలక్ష్మి కటాక్షం పొందడం ఎలాగా? మన దురదృష్టాన్ని ఎలా తొలగించుకోవాలి? దారిద్ర్యాన్ని మార్చి శ్రీ సంపన్నులు కావడానికి ఒకే ఒక మార్గం సాధన. సాధన మన భాగ్యంలో మార్పు తెస్తుంది. అనుష్టానం వలన ఇది మనము సాధించ వచ్చును. అమ్మ యొక్క కృప పొంద వచ్చును. మన జాతక చక్రం మారి పోతుంది. నిశ్చితమైన సాధన ద్వారా ఇది సాధించ వచ్చును. మన తల వ్రాతలు మార్చు కోవచ్చును. అమ్మ మీద నమ్మకం వుండాలి. ధార్మిక మైన కోరికలతో, శుద్ధ సాత్విక రూపములో శ్రీ లక్ష్మీ సాధన, మంత్ర సాధన చేస్తే తప్పక మీ కోరిక నెరవేరుతుంది, మీ దారిద్ర్యము తొలిగి మీరు నిస్సంకోచముగా ధనవంతులు అవుతారు.
ధన ప్రాప్తికి ఆటంకాలుగా వున్న భాధలు దూరమౌతాయ్. ఉన్నతమైన ఉద్యోగము లభిస్తుంది, అనుకూలత ఏర్పడుతుంది, ప్రమోషన్లు లభిస్తాయి, అధికారుల వలన ఇబ్బందులు తొలగి పోతాయి, మానసిక ఆందోళన తొలగి పోతుంది, వ్యాపారములో సానుకూలత ఏర్పడుతుంది, లాభాలు సమకూరును, నష్టాలు తొలగి పోవును, చింతలు తొలగి, ప్రశాంత ఏర్పడును, ఇంటిలోని సమస్యలు తొలగి పోవును, ఆర్ధిక ఇబ్బందులు తొలగి పోవును. సంతానము కలుగును. జీవితములోని అన్ని సమస్యలు తొలగి పోవును, సుఖ సంతోషములు కలుగును.
కనకధారాస్తవమును రోజుకు తొమ్మిది సార్లు వంతున 40 రోజులు శ్రద్ధతో, బ్రహ్మచర్యము, భూశయనము, ఏక భుక్తము, నియమములతో చేయ వలెను.

Tuesday, 5 September 2017

సత్సాంగత్యము అంటే ఏమిటి.......

సత్సాంగత్యము అంటే ఏమిటి.......
సత్సంగత్వే నిస్సంగత్వమ్ నిస్సంగత్వే నిర్మోహత్వమ్
నిర్మోహత్వే నిశ్చలతత్వమ్ నిశ్చలతత్వే జీవన్ముక్తిః
సత్సంగత్వంలో ఒక క్షణం గడపడం వలన జన్మజన్మల సంస్కారం కలుగుతుందట. అందుకు ఒక కథ ఉంది. ఒకసారి నారద మహర్షికి 'సత్సంగం అంటే ఏమిటి? దాని వల్ల కలిగే ఫలితాలేమిటి?' అనే సందేహం కలిగి దానిని నివృత్తి చేసుకోవడం కోసం శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్లి ఆయనను అడిగాడు. అప్పుడు శ్రీహరి, 'ఓస్! ఇంత మాత్రానికే నా దగ్గరకు రావాలా? అదిగో అక్కడ ఒక పురుగు పాకుతోంది. దాన్ని అడుగు' అన్నాడు. అలాగే వెళ్లి ఆ పురుగుని 'సత్సంగమంటే ఏమిటి?' అని అడిగాడు నారదుడు. దానికి ఆ పురుగు 'సత్సంగమంటే.' అంటూ ప్రాణం వదిలేసింది. నారదుడు ఇలా జరిగిందేమిటా అనుకుంటూ మళ్లీ విష్ణుమూర్తి దగ్గరకొచ్చాడు.
ఈసారి 'అదిగో అక్కడ చెంగనాలు పెడుతున్న కోడెదూడను అడుగు' అనగానే నారదుడు కోడెదూడను అదే ప్రశ్న అడగడంతోటే అది కూడా ప్రాణం వదిలింది. నారదుడు మళ్లీ విష్ణువు దగ్గరకు వెళితే, 'ఒక లేడి పిల్లను కంటోంది. పుట్టే ఆ పిల్లను అడుగు చెబుతుంది' అనడంతో నారదుడు అప్పుడే పుట్టిన లేడిపిల్లను అడిగాడు.
నారదుడికి అదే అనుభవం ఎదురయింది. నారదుడు బాధపడుతూ గట్టిపట్టుదలతో మళ్లీ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లాడు. విష్ణువు చిద్విలాసంగా 'నారదా! కాశీరాజుకు ఒక చక్కటి కుమారుడు పుడుతున్నాడు.
అతడిని అడిగి నీ సందేహం తీర్చుకో'అన్నాడు. అప్పుడు నారదుడు ''స్వామీ! మీరు నా సందేహం తీర్చుకొనేందుకు వెళ్లమంటున్నారా? లేక బిడ్డకు ఏదైనా అపాయం జరిగితే నాకు దేహశుద్ధి చేస్తారనే ఉద్దేశ్యంతో అక్కడకు పొమ్మంటున్నారా?'' అని అడిగాడు.
అందుకు శ్రీమహావిష్ణువు 'అటువంటిదేమీ జరగదు.
ఈసారి నీ సందేహం తప్పక తీరుతుంది. నీ రాకతో వారెంతో సంతోషిస్తారు'అని చెప్పడంతో నారదుడు కాశీరాజు ఇంటికి వెళ్లాడు. కొడుకు పుట్లిన ఆనందంలో అక్కడ వారందరూ ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో నారదుడు అక్కడికి రావడంతో వారంతా సంతోషంతో స్వాగతం పలికి అతిథిమర్యాదలు చేశారు.
నారదుడు ఆ బిడ్డను ఆశీర్వదించి ''నా సందేహం తీర్చవలసింది అంటూ వచ్చిన విషయం చెప్పాడు. అప్పుడు ఆ బిడ్డ, 'స్వామీ! మీరు నన్ను ఈ ప్రశ్న ముందు పురుగుగా ఉన్నప్పుడు, తర్వాత కోడెదూడగా ఉన్నప్పుడు వేశారు. ఆ తర్వాత జింకపిల్లగా ఉన్నప్పుడు వేశారు.
ఆ మాట వినటం చేత ఆ జన్మలన్నీ రహితమయ్యి ఈ జన్మ సంప్రాప్తించింది. అనగా కేవలం 'సత్సంగం' అనే ఒక్కమాట వినడంతోటే నాకు ఒకదాని తర్వాత మరొకటి ఇన్ని పవిత్రజన్మలు లభించాయి కదా! మరి ఇక నిజంగా సత్సాంగత్యం చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో కదా! నేను నీకు సర్వదా కృతజ్ఞుడిని'' అన్నాడు ఆ బాలుడు.

Monday, 4 September 2017

గురుస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు.............

గురుస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు.............
పరమపురుషుడు – శివుడు (లేదా విష్ణువు), అవ్యక్త శక్తి – ఉమాదేవి (లేదా లక్ష్మి) వీరిరువురి సంయోగమైన సమన్యాయమూర్తి కుమారస్వామి. ఈయననే స్కందుడు, సుబ్రహ్మణ్యుడు, షణ్ముఖుడు మొదలైన పేర్లతో శాస్త్రాలు సన్నుతించాయి. కుమారస్వామిని అర్చించడం అంటే, పార్వతీ పరమేశ్వరులను (లక్ష్మీ నారాయణులను) ఆరాధించడమే. బ్రహ్మచేత నిర్మితమైన అగ్నిమయ దివ్య శరణం (రెల్లుతప్ప) లో శివతేజం షణ్ముఖాకృతి ధరించిందని గాథ. కుమారస్వామి యొక్క అగ్నిమయ శివశక్తి రూపాన్ని స్పష్టం చేసే గాథలో ఇది ఒకటి.
కాలకాలుడు శంకరుడు ‘కాలాగ్ని’ అని పిలువబడే ఈ అఖండ రుద్రమూర్తి యొక్క తేజస్సే ‘సంవర్సరాగ్ని’, ఈ సంవత్సరాన్ని ఆధారం చేసుకొనే కాలగణన సాగుతుంది. ఈ సంవత్సరాగ్నికి సంకేతమే – పన్నెండు చేతులు ఆరు ముఖాలు. ద్వాదశ హస్తాలూ పన్నెండు మాసాలకు, ఆరు ముఖాలూ ఆరు ఋతువులకూ సంకేతాలు.
ఇక స్వామి కూర్చున్న మయూరం ‘చిత్రాగ్ని’ అనబడే అగ్నితత్వమే వర్ణాలకు సంకేతమిది. అగ్ని, అమృతాల సమైక్యమూర్తి (అగ్నీ సోమాత్మకం) సుబ్రహ్మణ్యుడు. స్వామి చేతిలో ఉన్న శక్తి ఆయుధం, అమ్మవారు ఇచ్చినదే. ‘శివజ్ఞాన ప్రదాయిని’ అయిన శ్రీమాత ఇచ్చిన ఆ శక్తి బలం – జ్ఞానం. ‘అహంకారం స్కందం’ అని చెప్పబడ్డ ప్రకారం.... సృష్టిలోనూ, ప్రతి జీవులలోనూ ‘నేను’ అనే భావనే స్కంధుడు. మనస్సుతో కలిపి అయిదు జ్ఞానేంద్రియాలూ ఉన్న ‘అహంకారమే’ కుమారస్వామి. ఇచ్చ, జ్ఞాన, క్రియ – ఈ మూడు ఈ ఆరు ముఖాలతో సాగుతున్నాయి.
ఇచ్ఛా, జ్ఞాన, క్రియా రూప మహిశక్తిధరం భజే!
శివశక్తి జ్ఞానశక్తి స్వరూకమ్!! (శివపురాణం)
కవిత్వ సంగీతాది విద్యల్లో కూడా అగ్రగణ్యుడు స్కందుడు. సుబ్రహ్మణ్యుని కవిరూపంగా వర్ణించాయి పురాణాలు.
‘పుట్టన్ బుట్ట శరంబునన్ మొలవ... ‘అనే పద్యంలో స్వామిని కవిగా పేర్కొన్నాడు పోతన. మహామహిమాన్వితమైన షట్కోణం షణ్ముఖునికి ప్రతీక, అన్ని కోణాలనుండి సమగ్రంగా విషయ జ్ఞానం సాధించగలిగే నిశితమైన బహుముఖప్రజ్ఞే ‘షణ్ముఖీ ప్రతిభ.’ బ్రహ్మ విష్ణు, శివాత్మక పరబ్రహ్మ శక్తిగా సుబ్రహ్మణ్యుని ‘మురుక’ అన్నారు. ‘ము’ కారస్తు ముకుంద: స్యాత్ ‘రు’ కారో రుద్రవాచక:! ‘క కారో బ్రహ్మనాదీ ఛ మురుకో గుహవాచకం!! (స్కందపురాణం) రహస్యమైన బ్రహ్మజ్ఞానమే ‘గుహ’ రూపం. అదే గురురూపం.
గురుస్వరూపుడైన – శివశక్తుల సమన్వయమూర్తి సుబ్రహ్మణ్యుని ఆరాధించి సకల శుభాలను పొందవచ్చు. కుమార స్వామి జననం స్కందపురాణంలో కుమారస్వామి జననం గురించి ఇలా వివరించబడింది. శివుడు ధ్యాననిష్టలో వున్న సమయంలో ఆయన తపస్సును భంగపరచడానికి మన్మధుడు వచ్చాడు.
మన్మధుడు ఉపయోగించిన కామశరాలు శివునిపై పడగా కోపించిన శివుడు తన జ్ఞాననేత్రం తెరిచాడు. దాంతో మన్మదుడు భస్మమయ్యాడు. పరమేశ్వరుని జ్ఞాననేత్రం నుంచి కదలిన జ్ఞానాగ్ని మన్మదుని భస్మం చేసి, ఆకాశాన పయనిస్తుండగా దాన్ని వాయువు సంగ్రహించి తాళలేక, మోయలేక అగ్నిదేవునికిచ్చాడు. అగ్నిదేవుడు కూడా శివుని తేజాన్ని తనలో నిలుపుకోలేక గంగాజలంలో పడేశాడు. ఆ దివ్యతేజాన్ని గంగ కూడా తనలో నిలుపుకోలేక శరవణంలో పడేసింది. ఆ రెల్లుపొదలో కుమారస్వామి ఆవిర్భవించాడు. అందువల్ల కుమారస్వామి శరవణుడు, శరవనోద్భవుడు అని కూడా అంటారు.
మంగళకరమైన శివుని మూడవ కంటినుంచి ఉద్భవించిన జ్ఞానకిరణమే కుమారస్వామి జన్మకు కారణమైంది. రూప విశిష్టం..... కుమారస్వామికి ఆరు తలలు వుండడం చేత షణ్ముఖుడు అనే పేరు వచ్చింది. సుబ్రహ్మణ్యస్వామి జ్ఞానస్వరూపం. అందుచేతనే అజ్ఞాన స్వరూపులైన రాక్షసులను హతమార్చాడు. అ జ్ఞానానికి ఆరు తాళాలుంటాయి. అవే – కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనే అరిషడ్వర్గాలు. ఆ ఆరు దుర్గుణాలున్న అజ్ఞాన రాక్షసిని ఆరుతలలు ఉంటే తప్ప చంపలేరు.
దైవ సంపదయైన ఆరు తలలు కలిగి అసుర సంపదకు సంభవించిన అరిష్టద్వార్గాలనే ఆరు తలలను తుంచివేయాలి. ఇదే షణ్ముఖుని రూప వైశిష్ట్యము.

Saturday, 2 September 2017

మహాలయ పక్షం...............

మహాలయ పక్షం...............
భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో, బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య నైనా చేసి తీరాలి. దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.
పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతానా భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితంలో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృఋణం తీర్చక పొతే వారికి ముక్తి లభించదు. మహాలయపక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి. సంతృప్తి చిందిన పితృ దేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి ఆరంభం చేయకూడదు. మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి.ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధ కర్మ నిర్వర్తించటం చేత పితరులకు తృప్తి కలుగుతుంది. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమి పై వ్యాపించి ఉంటుంది. పితరులను ఉద్దేశించి, వారి ఆత్మను తృప్తి పరచటానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు బ్రాహ్మణులతో కూడా వాయురూపంలో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించక పొతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు. నిజానికి, ప్రతి మాసంలోను అమావాస్య, పితరుల పుణ్య తిథిగా భావించబడినా, మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు, పితృ పక్షంలో ఆ తిథి నాడు కారణవశాన శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. ఎవరూ శ్రాద్ధ విముఖులు కాకూడదు. శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఆదర పూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మలో నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాల లోను అన్న దానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది, కాని ఈ మహాలయపక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది. ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. పాడ్యమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది ద్వితీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది తృతీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు చతుర్దినాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది, అంతే కాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు పంచమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వాళ్ళ ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన గలవారికి ఫలం లభిస్తుంది. షష్ఠి నాడు శ్రాద్ధ కర్మ వల్ల దేవతలు పితరులు ప్రసన్నులవుతారు, ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ఠ గౌరవం లభిస్తుంది. సప్తమి శ్రాద్ధ కర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది. అష్టమి తిథినాడు శ్రాద్ధ కర్మ వాళ్ళ చేస్తే సంపూర్ణ సమృద్ధి, ధనం, బుద్ధి ప్రాప్తిస్తాయి నవమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే విస్తారంగా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది దశమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ది చెందుతుంది ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే సర్వ శ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది, అన్ని పాపాలు నశిస్తాయి, వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది, కుటుంబం వృద్ది చెందుతుంది ద్వాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. శ్రాద్ధ కర్తకు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, పశు, మెధా బుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది త్రయోదశి నాడు శ్రద్ధ కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం, బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి చతుర్దశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది. అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆర్థిక భావం వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే, పితృ పక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాక పొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు, అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాన్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి, పితృ దేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.