Saturday, 5 August 2017

చంద్ర గ్రహణం ది 07/08/2017, సోమవారం.


ప్రారంభం: రా.గం.10:52 అంతం: రా.గం.12:48
ఈ గ్రహణం శ్రవణ నక్షత్రం లో జరుగుతుంది కాబట్టి శ్రవణ నక్షత్రం వారు మరియు మకరరాశి వారంతా విధిగా చేసుకోవాలని శాస్త్రం . అదీ కాక
"త్రిషడ్దశాయోపగతే నరాణాం
శుభప్రదం స్యాద్గ్రహణం రవీంద్వోః
ద్విసప్త నందేషు చ మధ్యమం స్యా
చ్ఛేషేష్వనిష్టం మునయో వదంతి."
అనగా జన్మరాశి నుండి 3,6,10,11 స్థానములందు గ్రహణం సంభవిస్తే అది శుభప్రదం. 2,7,9 రాశులయందు మధ్యమఫలం. 1,4,5,8,12 ల యందు అశుభం అని మహర్షులు తెలియజేస్తున్నారు. కాబట్టి మహర్షుల సలహాననుసరించి #మిథున_కన్య_తుల_కుంభరాశులవారు కూడా శాంతి చేయించుకోవాలి.
జ్యోతిషశాస్త్రానుసారం #వివిధరాశులపై #గ్రహణఫలితాలు ఇలా ఉన్నాయి.
మేషం - సుఖం * వృషభం - మాననాశము *
మిథునం - మృత్యుతుల్య కష్టం * కర్కాటక - స్త్రీకష్టం *
సింహం - సౌఖ్యమ్ * కన్య - చింత * తుల - శరీరపీడ *
వృశ్చికం - ధనలాభం * ధనుస్సు - క్షతి *
మకరం - ఘాతము* కుంభం- హాని* మీనం - లాభం
పైన పేర్కొన్న ఫలితాలు 6 నెలలలో జరుగుతాయి.
2. #శాంతి_ఏమి_చేయించుకోవాలి?
గ్రహణశాంతికి జ్యోతిష, ధర్మశాస్త్ర గ్రంథాలలో 3 రకాల శాంతులు చెప్పబడ్డాయి. అవి 1. బింబ దానం 2. మంత్ర స్నానం‌‌, 3. ఓషధీ స్నానం. వీటిలో ఏదో ఒకటి చేయించుకోవాలి.
A) రాత్రి రెండవఝూములో గ్రహణం కావున ముందు మూడు ఝాములు గ్రహణవేధ ఉంటుంది. కావున మధ్యాహ్నం 12గం.10ని. నుండి గ్రహణవేధ ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ లోపు భోజనాదులు పూర్తి చేసుకోవాలి. అయితే వృద్ధులు, రోగులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలకు సాయంత్రం 4గం.56ని.లవరకు మినహాయింపు ఉంది. ఆ తరువాత వారు కూడా ఏదీ భుజించరాదు. ఇక మరీ ఉండలేనివారికి రాత్రి 8గం.8 ని. ల వరకూ ఏదైనా తేలికపాటి పదార్థాలు స్వీకరించవచ్చు.
B) రాత్రి 12గం.48ని.లకు మోక్షానంతరం మోక్షస్నానమాచరించి అందరూ మితాహారం చేయవచ్చు.
C) గ్రహణ సమయంలో నిద్ర వలన రోగము , మూత్ర విసర్జన వలన దారిద్ర్యము , మలవిసర్జన వలన కృమిరోగము , మైథునం వలన పందిజన్మ , అభ్యంగనం వలన కుష్ఠు రోగము , భోజనం వలన నరకము కలుగుతాయని శాస్త్ర వచనాలెన్నో ఉన్నాయి.
గ్రహణం ముందు వండుకున్నవి గ్రహణానంతరం తినకూడదు. అయితే దీంట్లో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. గంజి , మజ్జిగ , నెయ్యి , పాలు వీటికి మరియూ వీటితో వండిన ఇతర పదార్థాలకీ కూడా దోషము లేదు. కానీ " కుశాంతరాళం కుర్వీత " అని ఉన్నది కావున వాటిలో దర్భలు వేసి ఉంచాలి.
" స్వస్వేష్ట దేవతా మంత్రజపం కుర్యాత్ప్రయత్నతః
యథాశక్తి జపేద్దేవీం గాయత్రీం ప్రయతస్సదా
చంద్రసూర్యోపరాగేతు మాలిన్యమజపాద్భవేత్."
అని పౌరాణిక , తాంత్రిక వచనములున్నాయి కనుక గ్రహణ సమయంలో ఇష్ట దేవతా మంత్రజపం చేయనియెడల మంత్రం మలినమైపోతుందని ఉన్నది కాబట్టి ఎవరెవరు వారి వారి గురువులవద్ద నుండి ఏయే మంత్రం గ్రహించారో వాటి జపం విధిగా చేయాలి. ఏమంత్రమూ లేనివారు ఉపనయనమైతే గాయత్రీజపమన్నా విధిగా చేయాలి. మిగిలినవారు సత్కాలక్షేపం చేయాలి.
ఉపాకర్మ చేసేవారు అందులో యజ్ఞోపవీతధారణ , దానము , హోమము ఇత్యాదులు ఉన్నాయి కాబట్టి వారు మాత్రమే విధిగా మార్చుకోవాలి. మిగిలినవారికి విధిగా మార్చుకోవాలన్న శాస్త్రనియమం లేనే లేదు. అయితే శ్రావణపౌర్ణమి అంటే జంధ్యాలపౌర్ణమి అనే నానుడి బాగా బలపడింది. అదే ఉపాకర్మ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని పండితులు కూడా నిర్ణయం చేసారు.
ఉంది. చంద్రగ్రహణం సోమవారం నాడు వస్తే దానికి #చూడామణిగ్రహణం అని పేరు. దీనిగురించి శాస్త్రం
" వర్షేష్వన్యేషు యత్పుణ్యం గ్రహణే చంద్రసూర్యయోః
తత్పుణ్యం కోటిగుణితం గ్రాసే చూడామణౌ స్మృతమ్"
మామూలు చంద్రగ్రహణం కన్నా ఈ చూడామణి గ్రహణం
స్నాన , దాన , జప హోమాదులయందు కోటిరెట్లు ఫలితాన్ని ఇస్తుందని వ్యాసభగవానుని వచనం.

No comments:

Post a Comment